మెదక్ మున్సిపాలిటీ, నవంబర్ 28 : ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ (చర్చి) ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. క్రిస్మస్ సమీపిస్తుండటంతో దూర ప్రాంతాల నుంచి భక్తులు, పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి.
భక్తులనుద్దేశించి చర్చి ఫాస్టర్ జైపాల్ దైవ సందేశం చేశారు. భక్తులు తమ మొక్కులు తీర్చుకొని చర్చి మైదానంలో చెట్లకింద వంటావార్పు చేసుకున్నారు. ఫాస్టర్లు దయానంద్, రాజశేఖర్, వర్జర్, డేవిడ్లు భక్తులను ఆశీర్వదించారు. ప్రార్థనల్లో చర్చి కమిటీ సభ్యులు రోలండ్పాల్, సంశాన్ సందీప్, సునీల్, సుశీల్ కుమార్, జాయ్ముర్రే, సువన్ డగ్లస్, శాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు.