మెదక్ మున్సిపాలిటీ, అక్టోబర్ 31 : భక్తులతో మెదక్ చర్చి కిటకిటలాడింది. ఆదివారం కావడంతో భక్తులు, పర్యాటకులు వందలాది మంది తరలి రావడంతో చర్చి ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా యేసయ్య నామస్మరణలతో హోరెత్తింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రతి గంట గంటకు జరిగే ప్రార్థనల్లో భక్తులు పాల్గొని యేసయ్యకు మొక్కులు తీర్చుకున్నారు.
ఈ సందర్భంగా ఫాస్టర్లు భక్తులనుద్దేశించి దైవ సందేశం చేశారు. సండే స్కూల్ విద్యార్థులు ఆలపించిన గీతాలు అందరిని ఆకట్టుకున్నాయి. ప్రార్థనల్లో చర్చి ఫాస్టర్లు దయానంద్, విజయ్కుమార్, డేవిడ్, జైపాల్, సీఎస్ఐ కమిటీ సభ్యులు రోలాండ్పాల్, సువన్డగ్లస్, ఐవన్, జాయ్ముర్రే, జయరాజ్, స్వామిదాస్, శాంతికుమార్, సుశీల్ తదితరులు పాల్గొన్నారు.