మెదక్ మున్సిపాలిటీ, మార్చి 27 : మెదక్ చర్చి భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం కావడంతో వందలాది మంది భక్తులు, పర్యాటకులు తరలి రావడంతో చర్చి ప్రాంగణమంతా సందడి నెలకొంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గంట గంటకు జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో వందలాది భక్తులు పాల్గొని యేసయ్యకు మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ సందర్భంగా చర్చి ప్రెసిబేటరీ ఇంచార్జీ రెవరెండ్ అండ్రూస్ ప్రేమ్సుకుమార్ భక్తులనుద్దేశించి దైవ సందేశం చేశారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ ప్రభువు చూపిన మార్గంలో నడుచుకోవాలని సూచించారు. ప్రార్థనల్లో చర్చి ఫాస్టర్లు రాజశేఖర్, దయానంద్, విజయ్కుమార్, డేవిడ్, జైపాల్, సీఎస్ఐ కమిటీ సభ్యులు రోలాండ్పాల్, శాంతికుమార్, సువన్డగ్లస్, జాయ్ముర్రే, తదితరులు పాల్గొన్నారు.