రామాయంపేట/చిన్నశంకరంపేట/నిజాంపేట/మెదక్ రూరల్, నవంబర్ 23: తెలంగాణ సాధించిన కేసీఆర్ ఔర్ ఏక్ ధక్కా.. హ్యాట్రిక్ సీఎం కావడం పక్కా అని, మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డి లక్ష ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తారని రామాయంపేట పురపాలిక చైర్మన్ పల్లె జితేందర్గౌడ్, వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి ధీమా వ్యక్తం చేశారు. గురువారం రామాయంపేట పురపాలికలో పట్టణాధ్యక్షుడు, కౌన్సిలర్లు నాగరాజు, దేమె యాదగిరి, సుందర్సింగ్, చిలుక గంగాధర్, మల్యాల కవిత, చంద్రపు శోభ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ యాదగిరి వేర్వేరుగా ఎన్నికల ప్రచారాలను చేపట్టారు. ముందుగా ఐదో వార్డులోని హనుమాన్ దేవాలయంలో పూజలు చేశారు. అనంతరం పురపాలికలోని మూడో వార్డు లో బీడీలు చుట్టేవారితో చైర్మన్ పుట్టి విజయలక్ష్మి బీడీలు చూడుతూ ప్రచారం చేస్తూ బీడీ కార్మికులకు ఆసరా పింఛన్లు అందించిన ఘనత సీఎం కేపీఆర్దేనని అన్నారు. కోమటిపల్లి, ఎనిమిదో వార్డులో చైర్మన్ జితేందర్గౌడ్ ప్రచారం ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో కన్నపురం కృష్ణాగౌడ్, బాలుగౌడ్, ఇమ్రాన్, రమేశ్, బీర రమేశ్, గుండ్ల నర్సింహులు, అవుసుల రవి, ఆసీఫ్, చంద్రం, పోచయ్య, వెంకన్న తదితరులు ఉన్నారు.
* బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే తెల్లరేషన్కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి ‘అన్నపూర్ణ పథకం’ ద్వారా సన్నబియ్యం అందిస్తామని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏకే గంగాధర్రావు తెలిపారు. గురువారం గవ్వలపల్లి, కొర్విపల్లి గ్రామాల్లో మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డికి మద్దతుగా ఆయన ఇంటింటికీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గంగాధర్రావు గడపగడపకూ బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టో వివరాలను ప్రజలకు వివరించారు. అంబాజీపేటలో జడ్పీటీసీ మాధవి, చిన్నశంకరంపేటలో మాజీ సర్పంచ్ కుమార్గౌడ్, రుద్రారంలో సర్పంచ్ లక్ష్మణ్, మండలంలోని వివిధ గ్రామాల్లో సంబంధిత గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచారంలో రైతు బంధు అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ మండలశాఖ అధ్యక్షుడు రాజు, ఎంపీటీసీ యాదగిరి సర్పంచులు, ఎంపీటీసీలు, సింగిల్విండో చైర్మన్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.
* ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని వెంకటాపూర్(కె) బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు అక్కల దుబ్బరాజు అన్నారు. గురువారం బీఆర్ఎస్ సీనియర్ నేతలు దయాకర్, సిద్ధిరాములుతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వ పథకాలను, బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రాజు, అనిల్, సత్తయ్య, స్వామి తదితరులు ఉన్నారు.
* మెదక్ మండలంలోని కోంటూర్ ఖాజిపల్లిలో గురువారం బీఆర్ఎస్ ఇంటింటి ప్రచారంలో భాగంగా ఆత్మకమిటీ చైర్మన్ ఆంజగౌడ్ బీఆర్ఎస్ సంక్షేమ పథకాలను వివరిస్తూ గడపగడపకూ వెళ్లి కారు గుర్తుకు ఓటు వేసి పద్మాదేవేందర్రెడ్డిని గెలిపించాలని ఓటర్లను కోరారు.