మెదక్, జనవరి 13 (నమస్తే తెలంగాణ): ఈ నెల 18 నుంచి ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకునేలా ఏర్పాట్లను పర్యవేక్షించవలసిందిగా మెదక్ అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ మండల ప్రత్యేకాధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్హాల్లో కంటి వెలుగు నిర్వహణ ఏర్పాట్లపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 18 నుంచి 31 వరకు ప్రతి మండలంలో 5 నుంచి 6 శిబిరాలు ఏర్పాటు చేయనున్నామని, ఈ శిబిరాల నిర్వహణపై ముందస్తుగా ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. ప్రధానంగా పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, గ్రామ పంచాయతీ భవనాల్లో శిబిరాలు ఏర్పాటు చేయనున్నామన్నారు. షెడ్యూల్ ప్రకారం శిబిరాలు ఏర్పాటు చేసే ప్రాంతాలను ముందుగానే సందర్శించి తగు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
జనాభాను బట్టి ఒకో ప్రాంతంలో 3, 4 రోజులు శిబిరాలు కొనసాగుతాయని, ఏ రోజు ఏ ప్రాంతం నుంచి ఎంత మంది రావాలో ఆశా వరర్లు, ఏఎన్ఎంలు, స్వయం సహాయక సభ్యులు ప్రజలకు అవగాహన కలిగించి కంటి పరీక్షలు చేయించుకునేలా ప్రోత్సహించాలన్నారు. ప్రిస్రిప్షన్ రాసిన వారికి పక్షం రోజుల్లో కంటి అద్దాలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. గ్రామాల్లో ఆప్టోమెట్రిస్ట్, వైద్యాధికారి, డేటా ఎంట్రీ ఆపరేటర్తో కూడిన బృందం అందరూ కూడా ఒకే దగ్గర ఉండేలా శిబిరాలకు సమీప దూరంలో భద్రతతో కూడిన వసతి ఏర్పాటు చేసుకోవాలన్నారు. గ్రామాల్లో శిబిరాల నిర్వహణ తేదీకి సంబంధించి జిల్లాలోని అన్ని చౌక ధరల దుకాణాలు, పెట్రోల్ బ్యాంకులు, గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ ప్రాంతాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో పాటు గ్రామాల్లో చాటింపు వేయించాలన్నారు. ఈ నెల 18 న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో శిబిరాలను ప్రారంభించి వారి చేతుల మీదుగా రీడింగ్ అద్దాలు అందించేలా చూడాలన్నారు.
శిబిరాల అవసరమైన ప్రాంతాల్లో పోలీసులు, స్థానిక మండల పరిషత్ అభివృద్ధి అధికారుల సహకారం తీసుకోవలసిందిగా సూచించారు. సమావేశంలో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి చందునాయక్, డీపీవో రాజేంద్రప్రసాద్, మండల ప్రత్యేకాధికారులు జయరాజ్, శ్రీనివాస్, విజయ శేఖర్రెడ్డి, శ్రీనివాస్ రావు, కేశూరం, కృష్ణమూర్తి, బ్రహ్మాజీ, విజయలక్ష్మి, ఇందిర, నాగరాజ్, కరుణ, ఆశాకుమారి నర్సయ్య, రజిని, భీమయ్య, డాక్టర్ సుమిత్ర, డాక్టర్ నవీన్, 40 బృందాల అధికారులు పాల్గొన్నారు.