మెదక్రూరల్మే 21: కరోనావిజృభిస్తున్న నేపథ్యంలో. ఒక్కో కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు కొవిడ్ బారిన పడుతున్నారు. కరోనా వచ్చిన వ్యక్తులు 20 రోజుల పాటు హోంక్వారంటైన్లో ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. ఇంట్లో తల్లిదండ్రులు ఇద్దరికి కరోనా సోకితే చిన్న పిల్లలు సంరక్షణ ప్రశ్నార్థకంగా మారింది. ఇలాంటి పిల్లల కోసం తెలంగాణ ప్రభుత్వం స్త్రీ శిశు సంక్షేమశాఖ, ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బాలలను పరిరక్షించేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేశారు. కుటుంబంలో ఒక్కరికి కరోనా వచ్చినా ప్రత్యేకంగా ఉండటానికి ఇంట్లో వసతులు ఉండవు. భార్య, భర్తలిద్దరికి కరోనా వస్తే పిల్లలు పరిస్థితి దయనీయంగా మారుతున్నది. వారి సంరక్షణ కోసం ఎవరు ముం దుకు రావటం లేదు. చిన్నారులకు భరోసాగా 6 నుంచి 18 ఏండ్ల లోపు బాలబాలికలకు వసతి, రక్షణ, సంరక్షణ నిమి త్తం సహాయ కేంద్రం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తల్లిదండ్రులు కరోనా నుంచి కోలుకుని వచ్చే వరకు చిన్నారుల కోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు.
రెండు చోట్ల వసతి
మెదక్లో రెండు చోట్ల ట్రాన్సిట్ హోం(పరిమిత కాలం సేవలందించే గృహం )ప్రత్యేకంగా ఏర్పా ట్లు చేశారు. 1.మెదక్ ఎంపీడీవో కార్యాల యం వద్ద ఉన్న బాలసదనం.(బాలికలకు)