మనోహరాబాద్, జూన్ 18 : హరిత తెలంగాణను తయారు చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టారని జడ్పీ చైర్ పర్సన్ ర్యాకల హేమలతాశేఖర్గౌడ్ అన్నారు. మనోహరాబాద్ మండలం దండుపల్లిలో శుక్రవారం హరితహారంలో భాగంగా మొక్కలను నాటారు. ఈ సం దర్భంగా ఆమె మాట్లాడుతూ జంగల్ బచావో.. జంగల్ బడావో నినాదంతో అటవీ శాతాన్ని పెంపొందించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న హరితహారం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. పరిరక్షించడం మనందరి బాధ్యతని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మొక్కలను నాటాలని కోరారు. మొక్కలను నర్సరీల్లో పెంచి గ్రామంలోనే నాటే విధంగా చర్యలు తీసుకుంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వమన్నారు. ఆరు విడుతలుగా నిర్వహించిన హరితహారంలో నాటిన మొ క్కలు నేడు పల్లెల్లో ఆహ్లాద వాతావరణాన్ని కలిగిస్తున్నాయన్నారు. పల్లె ప్రగతితో మారుమూల గ్రామాలు సైతం పట్టణాలను తలదన్నే విధంగా తయారయ్యాయన్నారు. గ్రామాభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఇంటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా చూసుకోవాలన్నారు. అధికారులు సైతం పల్లె ప్రగతిపై దృష్టి సారించాలని సూచించారు. అనంతరం దండుపల్లి వైకుంఠధామాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ విఠల్రెడ్డి, మండల ప్రత్యేకాధికారి కృష్ణమూర్తి, ఎంపీడీవో జైపాల్రెడ్డి, సర్పంచ్లు పంజా లక్ష్మి, నర్సయ్య, ఇన్చార్జి సర్పంచ్ కాళిదాస్, ఉప సర్పంచ్లు మహేందర్గౌడ్, శ్రీహరి, ముదిరాజ్ మహాసభ జిల్లా నాయకులు చంద్రశేఖర్ ముదిరాజ్, కూచారం నరేశ్, నాయకులు కృష్ణాగౌడ్, రమేశ్గౌడ్, నానిగౌడ్, నత్తి మల్లేశ్, వెంకటేశ్గౌడ్ పాల్గొన్నారు.