రామాయంపేట, మే 16 : రామాయంపేట పట్టణంతో పాటు మండలంలోని ఝాన్సీలింగాపూర్, డి.ధర్మారం, రాయిలాపూర్, కోనాపూర్ తదితర గ్రామాల్లో పారిశుధ్య పనులను ఆయా గ్రామాల సర్పంచ్లు జోరుగా కొనసాగిస్తున్నారు. కరోనా నేపథ్యంలో గ్రామాల్లో చెత్త లేకుండా వీధులు, మురికి కాల్వలను ఎప్పటికప్పుడూ శుభ్రం చేయిస్తున్నారు. రామాయంపేటలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్గౌడ్ ఎప్పడికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అక్కడక్కడ మురికి నీరు, మురికి కాల్వలు శుభ్రంగా లేకుంటే పారిశుధ్య కార్మికులతో తీయిస్తున్నారు. మళ్లీ ఇది పునరావృతం అయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. వైద్యసిబ్బంది ఇంటింటా జ్వర సర్వేలను నిర్వహించి మందులను అందజేస్తున్నారు. దీంతో గ్రామీణ ప్రాంత ప్రజలు ప్రభుత్వం చేస్తున్న పనికి హర్షం వ్యక్తం చేస్తున్నారు.