నిజాంపేట,మే14: కరోనా నేపథ్యంలో శుక్రవారం మండల వ్యాప్తంగా ముస్లింలు తమ ఇండ్లల్లోనే రంజాన్ పండుగను జరుపుకొన్నారు. ఇంట్లోనే కుటుంబ సభ్యులు ప్రార్థనలు చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
రామాయంపేట…
రామాయంపేట, మే 14: కరోనా కారణంగా రం జాన్ పండుగను ముస్లింలు ఇండ్లలోనే నిర్వహించుకున్నారు రామాయంపేటలో మున్సిపల్ చైర్మ న్ పల్లె జితేందర్గౌడ్, వైస్ చైర్పర్సన్ విజయలక్ష్మి, మాజీ జడ్పీటీసీ సరాఫ్ యాదగిరి, పీఏసీఎస్ చైర్మన్ బాదె చంద్రం ముస్లింలు ఈద్ ముబారక్ తెలిపారు.
వెల్దుర్తి…
వెల్దుర్తి, మే 14: లాక్డౌన్ దృష్ట్యా వెల్దుర్తి, మాసాయిపేట మండలాల్లో ము స్లిం సోదరులు రంజాన్ వేడుకలను సాదాసీదాగా జరుపుకున్నారు.
తూప్రాన్ మండలంలో ..
తూప్రాన్ రూరల్, మే 14ః తూప్రాన్ పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో సాదాసీదాగా రంజాన్ వేడుకలను జరుపుకున్నారు. సామూహిక ప్రార్థనా మందిరాలు, ఈద్గా మైదానాలకు వెళ్లకుండాప్రభుత్వం సూచించిన విధంగా లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ ఎవరి ఇండ్లలో వారే కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. వేర్వేరుగా నిర్వహించిన కార్యక్రమాల్లో టీఆర్ఎస్ నాయకులు అజార్, సమీర్, ముజీబ్లతో పాటు ముస్లిం మైనార్టీలు పాల్గొన్నారు.