వెల్దుర్తి, ఏప్రిల్ 14: అంబేద్కర్ అడుగు జాడలో నడువాలని ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని మండల పరిధిలోని రామంతాపూర్ పంచాయతీ లింగారెడ్డిపల్లిలో, వెల్దుర్తి మండలం రామాయిపల్లి, యశ్వంతరావుపేట గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాలను ఎమ్మెల్యే ఆవిష్కరించి, పూలమాల వేసి నివాళులర్పించా రు. అనంతరం ఎమ్మెల్యే మాట్లా డుతూ లింగారెడ్డిపల్లి, రా మాయిపల్లి, యశ్వంతరావుపేట గ్రామాల్లో అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే అన్నారు.
కల్యాణక్ష్మి చెక్కుల అందజేత..
మాసాయిపేట మండల పరిధిలోని లింగారెడ్డిపల్లిలో కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు ఎమ్మెల్యే మదన్రెడ్డి చెక్కులను అందజేశారు. వెల్దుర్తి, మాసాయిపేట మండలాల పరిధిలో మరికొంత మందికి చెక్కులు మంజూరు అయ్యాయని వాటిని త్వరలో అందజేస్తామని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, జిల్లా కోఆప్షన్ సభ్యుడు మన్సూర్, ఎంపీపీ స్వరూప, జడ్పీటీసీ రమేశ్గౌడ్, రైతు బంధు మండల కోఆర్డినేటర్ వేణుగోపాల్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు భూపాల్రెడ్డి, సర్పంచ్లు ప్రణిత, నారాయణ, మధుసూదన్రెడ్డి, గోపి, ఎంపీటీసీలు అంబేద్కర్ సంఘం సభ్యులు పాల్గొన్నారు.
మనోహరాబాద్ మండలంలో జడ్పీ చైర్ పర్సన్ ..
మనోహరాబాద్, ఏప్రిల్ 14: మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేట, దండుపల్లి, జీడిపల్లి, మనోహరాబాద్ గ్రామా ల్లో నిర్వహించిన అంబేద్కర్ జయంతిలో ,జడ్పీ చైర్ పర్స న్ ర్యాకల హేమలతాశేఖర్గౌడ్ ఫుడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎలక్షన్రెడ్డితో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూల మాలవేసి నివాళ్లులర్పించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి, సర్పంచ్ల ఫోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహిపాల్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహేశ్, ఎంపీపీ నవనీత, పాల్గొన్నారు.
తూప్రాన్ రూరల్…
తూప్రాన్ రూరల్, ఏప్రిల్14: అంబేద్కర్ జయంతి తూప్రాన్ పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించారు. తూప్రాన్లో ఫుడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎలక్షన్రెడ్డితో కలిసి మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్గౌడ్, వైస్ చైర్మన్ శ్రీనివాస్, నాగులపల్లిలో సర్పంచ్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు మహిపాల్రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు భగవాన్రెడ్డి, యావాపూర్లో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాబుల్రెడ్డి, మల్కాపూర్లో సర్పంచ్ మహాదేవి, ఎంపీటీసీ వెంకటమ్మ, అంబేద్కర్ సంఘం ప్రతినిధులు, అంబెద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమాల్లో అంబేద్కర్ సంఘం ప్రతినిధులు, కౌన్సిలర్లు, మండలంలోని సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
నర్సాపూర్..
నర్సాపూర్, ఏప్రిల్14: అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని మున్సిపల్ చైర్మన్ మురళీయాదవ్ ఆయన విగ్రహానికి పూలమాల వేసి కేక్ కట్ చేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అశ్రిత్కుమార్, కౌన్సిలర్లు లతరమేశ్ యాదవ్, యాదగిరి, రామ్చందర్, నాయకులు ఆంజనేయులు గౌడ్, భిక్షపతి పాల్గొన్నారు.
అచ్చంపేట్ …
మండల పరిధిలోని అచ్చంపేట్ లో అంబేద్కర్ జయంతి ఆత్మకమిటీ చైర్మన్ శివకుమార్, పీఏసీఎస్ చైర్మన్ రాజుయాదవ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు భిక్షపతి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
రామాయంపేట..
రామాయంపేట, ఏప్రిల్14: రామాయంపేట పట్టణంతో పాటు మండలంలోని ఝాన్సీలింగాపూర్, అక్కన్నపేట, డీ ధర్మారం గ్రామాల్లో అంబేద్కర్ జయంతి అంబేద్కర్ యు వజన సంఘం ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఝాన్సీలింగాపూర్లో సర్ప ంచ్ జ్యోతి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఎస్సీ ఉద్యోగ సంఘం ఆధ్యర్యంలో కిరణ్ నివాళులర్పించారు.
నిజాంపేట…
నిజాంపేట,ఏప్రిల్14: నిజాంపేటలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో,మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ సిద్ధిరాములు అంబేద్కర్ జయంతి నిర్వహించారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.కార్యక్రమంలో మండల కో-ఆప్షన్ సభ్యుడు గౌస్ ఎంపీటీసీ లహరి, బాల్రెడ్డి, సురేశ్, ఉపసర్పంచ్ బాబు, అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ పాల్గొన్నారు.
కౌడిపల్లి…
కౌడిపల్లి, ఏప్రిల్14: మండల పరిధిలోని వెల్మకన్నలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ జ యంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివా స్, ఉపసర్పంచ్ రాజేందర్, వైస్ ఎంపీపీ నవీన్, పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్రెడ్డి పాల్గొన్నారు.
చేగుంట..
చేగుంట , ఏప్రిల్14:: అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని చేగుంటలోని మక్కరాజిపేట చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి ఎంపీపీ శ్రీనివాస్, సర్పంచుల ఫొరం మండల అధ్యక్షుడు శ్రీనివాస్, ఎంపీటీసీ అయిత వెంకటలక్ష్మి, వల్లూర్లో ఎంపీపీ సబిత, సర్పంచ్ మహేశ్వరి అంబేద్కర్ విగ్రహానికి పూల వేసి నివాళ్లులర్పించారు. అనంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో చేగుంట సొసైటీ డైరెక్టర్ , వార్డు సభ్యులు, రెడ్డిపల్లి సొసైటీ చైర్మన్ పాల్గొన్నారు.
చిలిపిచెడ్…
చిలిపిచెడ్, ఏప్రిల్ 14: అంబేద్కర్ జయంతి సందర్భంగా మండలంలో చిట్కుల్ గ్రామంలో ఎంపీపీ వినోదదుర్గారెడ్డి, వైస్ ఎంపీపీ విశ్వంభర స్వామి,ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో శశిప్రభ, గౌతాపూర్ లో ఎస్ఐ మల్లారెడ్డి, అజ్జమర్రి, చిట్కుల్ గ్రామంలో సర్పంచులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
కొల్చారం…
కొల్చారం,ఏప్రిల్ 14: మండల పరిధిలోని ఎనగండ్లలో క్రాంతి యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయం తి సందర్భంగా ఎంపీపీ మంజుల విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రంగంపేటలో సర్పంచ్ సుజాత, సంగాయిపేటలో సర్పంచ్ మానస, ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు ప్రభాకర్, చిన్న ఘనపూర్లో సర్పంచ్ ఇంది రాప్రియదర్శిని పూలమాల వేసి నివాళులర్పించారు.