జిన్నారం, జూలై 8 : పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రం జిన్నారంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో, కొడకంచి గ్రామంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా జడ్పీవైస్ చైర్మన్ ప్రభాకర్, డీఎల్పీవో సతీశ్రెడ్డితో, ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే మొక్కలు నాటారు. అనంతరం జిన్నారంలో రోడ్లను చీపుర్లతో ఊడ్చారు. ప్రతి ఇంటి వద్ద ఆరు మొక్కలు నాటాలని కోరారు. ఎమ్మెల్యే వెంట సర్పంచ్లు లావణ్యశ్రీనివాస్రెడ్డి, శివరాజ్, ఎంపీటీసీలు వెంకటేశంగౌడ్, లావణ్యనరేశ్, ఎంపీడీవో సుమతి, తహసీల్దార్ దశరథ్, సీఐ లాలూనాయక్, ఎస్సై సమియజ్ జమా, ఎంపీవో రాజ్కుమార్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజేశ్, ఉపసర్పంచ్లు సంజీవ, అభిలాశ్గౌడ్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
ఆర్సీపురంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే, కార్పొరేటర్
హరితహారంలో భాగంగా ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. గురువారం ఆర్సీపురం డివిజన్లోని కాకతీయనగర్లో కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పానగేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన హరితహారం, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం కాలనీలోని పార్కులో ఎమ్మెల్యే, కార్పొరేటర్ మొక్కలు నాటారు. అనంతరం పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో పాల్గొని పార్కు పరిసరాల్లో ఉన్న కలుపు మొక్కలను తొలగించి శుభ్రం చేయించారు. స్వ యంగా ఎమ్మెల్యే చెత్తను తట్టలోకి ఎత్తుకొని ఆటోలో వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలందరూ హరితహారంలో భాగస్వాములై మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట జడ్పీవైస్ చైర్మన్ ప్రభాకర్, నాయకులు ఆదర్శ్రెడ్డి, సోనుగౌడ్, భాస్కర్రెడ్డి, నరేంద్రబాబు, శ్రీను, సంజీవరెడ్డి, శేషాద్రి, బల్దియా అధికారులు ఉన్నారు.