గజ్వేల్అర్బన్, మే 7: హోం క్వారంటైన్లో ఉన్నవారికి యువత అండగా నిలిచింది. గజ్వేల్ మండలం దాచారం గ్రామానికి చెందిన చేతిరెడ్డి రేవంత్రెడ్డి అనే యువకుడు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. తన మిత్రులతో కలిసి వారధి ఫౌండేషన్ను స్థాపించి అనాథ చిన్నారులకు విద్య, భోజనం తదితర సౌకర్యాలకు ఆర్థికంగా సహకారం అందిస్తున్నారు. కరోనాతో హోం క్వారంటైన్లో ఉంటున్న బాధితులకు ఇంటివద్దకే భోజనాన్ని అందజేస్తున్నారు. తన మిత్రులు, బంధువులతో కలిసి ఇప్పటివరకు రూ.50వేలకు పైగా డబ్బులు పోగు చేసి భోజన పంపిణీ చేసే సంస్థకు అందజేశారు. వారి ద్వారా కరోనా బాధితుల ఇంటికే భోజనాన్ని అందజేస్తున్నారు.
మాకు తోచిన సాయం చేయాలనిపించింది
కరోనాతో ఇబ్బందులు పడుతున్న వారిని చాలా బాధేసింది. ఇంటివద్ద ఉంటూనే ఉద్యోగాలు నిర్వహిస్తున్నాం. ఈ సమయంలో అసలు పనులు లేనివారికి కరోనా వస్తే వారి పరిస్థితి ఏమిటని ఆలోచించాం. వెంటనే మా వారధి ఫౌండేషన్ ద్వారా స్నేహితులకు పిలుపునిచ్చాం. కరోనా బాధితులందరికీ భోజనం అందించేందుకు సహకరించాలని కోరాను. నాతో పాటు వారు కూడా ఆర్థిక సాయం చేశారు. ఇప్పటివరకు రూ.50వేలు జమ చేసి భోజన పంపిణీ చేసే సంస్థకు కరోనా బాధితులకు భోజనాన్ని అందించే బాద్యతను అప్పగించాం. ప్రతిరోజు బాధితులకు పౌష్టికాహారాన్ని అందజేస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఈ ప్రక్రియను కొనసాగించడానికి డబ్బులు సేకరిస్తున్నాం.