రాయికోడ్, మే 7: ప్రభుత్వం పల్లె అభివృద్ధికి అమలు చేస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమం గ్రామాల్లో విజయవంతమవుతున్నది. మండల పరిధిలోని పీపడ్పల్లి ప్రగతి బాటన సాగుతున్నది. ఇం దులో రూ.2.50 లక్షలతో డంపింగ్యా ర్డు, రూ.22 లక్షలతో రైతువేదిక, రూ.10 లక్షలతో వైకుంఠధామం నిర్మించగా, మరో రూ.10 లక్షలతో పల్లె ప్రకృ తి వనం, పార్క్ ఏర్పాటు చేశారు. నర్సరీని ఏర్పాటు చేసి 10 వేల మొక్కలను పెంచుతున్నారు. సుమారు 1200ల మొక్కలతో రోడ్డుకిరువైపులా ఎవెన్యూ ప్లాంటేషన్ చేయగా, మరో 7200ల మొక్కులను గ్రామంలో పంపిణీ చేశారు. గ్రామంలో మురుగు కాల్వాల ఏర్పాటుచేసి, సీసీ రోడ్లు నిర్మించారు. గ్రామంలోని 270 విద్యుత్ స్తంభాలకు గాను ఎల్ఈడీ లైట్లను అమర్చడంతో పాటు ప్రధాన కూడళ్ల వద్ద హైమాస్ట్ లైట్లను ఏర్పాటు చేసి విద్యుత్ కాంతులు నింపారు. మిషన్ భగీరథ ద్వారా రెండు ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు ద్వారా ఇంటింటికీ నల్లా ద్వారా తాగు నీటి సరఫరా చేస్తున్నారు.
గ్రామ స్వరూపం…
గ్రామంలో 550 కుటుంబాలు నివసిస్తున్నాయి. మొత్తం జనాభా 2800 కాగా, ఇందులో పురుషులు 1500, స్త్రీలు 1300 ఉన్నారు.