పటాన్చెరు, ఏప్రిల్ 7: పరిశ్రమల భద్రత విషయంలో రాజీపడబోమని సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు మండలం పాటి గ్రామంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఫార్మా, ఇతర కంపెనీల ప్రతినిధులతో ఏర్పాటైన సొసైటీ ఫర్ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్ మొదటి సమావేశంలో ఎస్పీ గౌరవ చైర్మన్గా పాల్గొన్నారు. నూతనంగా ఎన్నుకున్న కౌన్సిల్ బాడీని పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా లో అన్ని పారిశ్రామికవాడలకు రక్షణ కల్పిస్తున్నామన్నారు.పారిశ్రామికవాడల్లో దొంగతనాలు, బ్లాక్ మెయిలింగ్, దాడులు అరికట్టేందుకు నిఘా పెంచుతున్నామన్నారు. కౌన్సిల్ ఆఫీస్ బేరర్స్, ఎగ్జిక్యూటీవ్ మెంబర్స్కు పోలీసులు పూర్తిగా సహకరిస్తారన్నారు. అవసరం ఉన్నచోట ఔట్పోస్టులు ఏర్పటు చేస్తామని హామీనిచ్చారు. ఈ సందర్భంగా సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశంలో ఉమెన్స్ ఫోరం, ట్రాఫిక్ ఫో రం, సెక్యూరిటీ ఫోరాన్ని చేశారు. కొత్తగా ఎన్నుకున్న కౌన్సిల్ బృందాన్ని ఎస్పీ శుభాకాంక్షలు తెలిపారు. కౌన్సిల్ గౌరవ చైర్మన్గా ఎస్పీ చంద్రశేఖర్రెడ్డి, వైస్ చైర్మన్గా రామ్మోహన్రెడ్డి, సెక్రటరీగా చందుకుమార్, కన్వీనర్గా ఎస్డీపీవో పటాన్చెరు భీంరెడ్డి, ట్రెజరర్గా ఐఎస్ఆర్ రావు, జాయింట్ సెక్రటరీ ఉమెన్స్ ఫోరంగా పరిణిత సైకియా, జాయింట్ సెక్రటరీగా రవి, గిరిప్రసాద్ నియామకమయ్యా రు. కార్యక్రమంలో పోలీసు శాఖ అధికారులు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.