డీఆర్డీవో శ్రీనివాస్
రామాయంపేట, జూన్ 5 : పోస్టాఫీస్లో పింఛన్ తీసుకునే వారందరికీ పింఛన్లు అందిస్తామని, అందుకోసం పోస్టాఫీస్తో పాటు అదనంగా మరో పాయింట్ను చూస్తున్నామని, రెండు రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పింఛన్ తీసుకోవచ్చని మెదక్ జిల్లా డీఆర్డీవో శ్రీనివాస్, రామాయంపేట పోస్టాఫీస్ సూపరింటెండెంట్ సంపత్రెడ్డి అన్నారు. శనివారం రామాయంపేటలో వారు విలేకరులతో మాట్లాడారు. రామాయంపేట పట్టణంతో పాటు మున్సిపల్ పరిధిలోని గొల్పర్తి, కోమటిపల్లి, గిరిజన తండాలో మొత్తం 2740 మంది పింఛన్దారులు ఉన్నారన్నారు. గొల్పర్తి, కోమటిపల్లి, గిరిజన తండాలకు ఒక్కరిని నియమించి ఆ గ్రామాల్లోనే పింఛన్ ఇస్తామన్నారు. రాయిలాపూర్లో పోస్టల్శాఖ వారు ఉపాధి డబ్బులు ఇవ్వకుండా ఇచ్చినట్లు రికార్డుల్లో చూపిస్తు జాప్యం చేస్తున్నారని, వెంకటాపూర్ కార్యదర్శి శ్యామల అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. వారి వెంట జిల్లా డిప్యూటీ అధికారి మెర్సినా, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, వైస్చైర్పర్సన్ పుట్టి విజయలక్ష్మి, ఎంపీవో గిరిజారాణి, ఏపీవో శంకర్, కౌన్సిలర్లు గజవాడ నాగరాజు, దేమె యాదగిరి, సుందర్ సింగ్, టీఆర్ఎస్ నాయకుడు శ్యాంసుందర్ ఉన్నారు.