వెల్దుర్తి, మే 3: హల్దీప్రాజెక్టు ఎడమకాల్వతో వెల్దుర్తి మండలంలోని పలు గ్రామాల్లో గొలుసుకట్టు చెరువులోకి గోదావరి జలాలు రానున్నాయని జడ్పీటీసీ రమేశ్గౌడ్, వెల్దుర్తి-2 ఎంపీటీసీ మోహన్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు భూపాల్రెడ్డి, నాయకులు నరేందర్రెడ్డి, తోటనర్సింహులు హర్షం వ్యక్తం చేశారు. గోదావరి జలాలతో అలుగుపారుతున్న మాసాయిపేట మండల పరిధిలోని హల్దీప్రాజెక్టు ఎడమ కాల్వ ద్వా రా సోమవారం వెల్దుర్తి మండల ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ, నాయకులు మాట్లాడుతూ ఇరవై రోజులుగా ఉమ్మడి వెల్దుర్తి మండలంలోని హల్దీప్రాజెక్టుతో పాటు వాగుపై ఉన్న ఎనిమిది చెక్డ్యాంలు మత్తళ్ల్లు దూకుతున్నాయన్నారు. యాసంగిలో హల్దీవాగు పరీవాహక ప్రాంత రైతుల సాగు చేసిన పంటలు ఎండిపోకుండా ఉండడానికి ఎమ్మెల్యే విజ్ఞప్తితో కొండపోచమ్మ నీటిని విడుదల చేసిన సీఎం కేసీఆర్ రైతుల పాలిట దేవుడు అని కొనియాడారు.
హల్దీవాగు పూర్తిస్థాయిలో ప్రవహించడంతో ఎడమ కాల్వ ద్వారా నీటిని విడుదల చేస్తే వెల్దుర్తి మండలంలోని ఆరు గ్రామాల పరిధిలోని పలు గొలుసుకట్టు చెరువులోకి నీళ్లు చేరుతాయని, సుమారు వెయ్యి ఎకరాల ఆయకట్టు సాగుఅవుతుందని ఎమ్మెల్యే మదన్రెడ్డికి విన్నవించగా స్పందించిన ఎమ్మెల్యే నీటి విడుదలకు ఆదేశించారన్నారు. ఎడమకాల్వ ద్వారా హస్తాల్ పూర్ తిమ్మారెడ్డికుంట, శేరిపబ్బ చెరు వు, వెల్దుర్తి కుడిచెరువు, పిన్చెరువు, ఆరెగూడెం రాంశెట్టిచెరువు, పంతులపల్లి పంతుల్ చెరువు, కుకునూర్ ఎల్లమ్మ చెరువులు నిండనున్నాయని, దీంతో వెల్దుర్తి మండలం సస్యశ్యామలం కానుందన్నారు. గోదావరి జలాలను విడుదల చేసిన సీఎం కేసీఆర్కు, సహకరించిన మంత్రి హరీశ్రావు,ఎమ్మెల్యే మదన్రెడ్డిలకు ఉమ్మడి వెల్దుర్తి మండల రైతుల పక్షాన వారు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్ర మంలో సర్పంచ్లు శేఖర్, మలేశ్గౌడ్, వెల్దుర్తి ఉపసర్పంచ్ సత్యనారాయణ, నాయకులు బాల్రెడ్డి, మహేందర్రెడ్డి, పాండురంగం, కిష్ట య్య, శేకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.