మెదక్, ఏప్రిల్ 1 : మెదక్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి దెబ్బకు జనం తల్లడిల్లుతున్నారు. ఏప్రిల్, మే నెలలో దంచికొట్టాల్సిన ఎండలు మార్చిలోనే ముదిరిపోయాయి. పది రోజులుగా వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులతో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. జిల్లాలో ఐదు రోజులుగా రికార్డు స్థాయిలో 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలు ఉద యం 11 గంటలకే ఇండ్లకు పరుగులు తీస్తున్నారు. చల్లదనం కోసం కూలర్లు, ఏసీల ద్వారా సేదతీరుతున్నారు. ఈ ఏడాది ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవ రి నెలాఖరు నుంచే జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి.
ఉదయం నుంచే సూర్య ప్రతాపం
ఉదయం నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మధ్యాహ్నం వడగాల్పులు కూడా ప్రారంభమయ్యాయి. దీంతో చాలా మంది ఇండ్లకే పరిమితమవుతున్నారు. మార్చి 27వ తేదీన 38.7 డిగ్రీల సెల్సిఎస్లోగా ఉష్ణోగ్రతలు నమోదు కాగా, 30వ తేదీన 40.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇప్పుడే ఇంత ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే మే నెలలో పరిస్థితులు ఎలా ఉంటాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మధ్యాహం తర్వాత బయటకు వెళ్ల వద్దని వైద్యులు సూచిస్తున్నారు. మండుతున్న ఎండలకు జిల్లాలోని ప్రధాన రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఎండవేడిమికి శీతలపానియాల అమ్మకా లు ఊపందుకున్నా యి. నీరు, మజ్జిగ, కొ బ్బరినీరు, ఓఆర్ఎస్ ద్రావణాన్ని ఎక్కువగా తీసుకోవాలని వైద్యు లు సూచిస్తున్నారు.
ఇవీ కూడా చదవండీ..
మగ ఉద్యోగులకు 24 వారాల పేరెంటల్ లీవ్.. వోల్వో ఇండియా నిర్ణయం
బ్లడ్ క్యాన్సర్.. లక్షణాలు ఎలా ఉంటాయి.. చికిత్స ఏంటి..?
పోలింగ్ రోజునే మోడీ బెంగాల్ ఎందుకు వస్తున్నారు?: మమత