అందోల్/నర్సాపూర్, జూలై 20 : రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్గా నియామకమైన మఠం భిక్షపతి గురువారం హైదరాబాద్లో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్రావు, రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, రోడ్లు, భవణాల శాఖ మంత్రి ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్సీలు కవిత, శేరి సుభాశ్ రెడ్డి, మల్లేశం, ఎంపీ బీబీ పాటిల్, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి, ఎమ్మెల్యేలు చంటి క్రాంతికిరణ్, మాణిక్ రావు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ప్రజా ప్రతినిధులు, నాయకులు పెద్ద ఎత్తున్న హాజరయ్యారు. ఈ సందర్భంగా భిక్షపతిని ఘనంగా సన్మానించారు. మంత్రులు మహమూద్ అలీ, హరీశ్రావు, ఎంపీబీబీ పాటిల్, ఎమ్మెల్యే క్రాంతికిరణ్ కార్పొరేషన్ చైర్మన్ భిక్షపతిని ఆయన కార్యాలయంలో కూర్చొబెట్టి అభినందనలు తెలియజేశారు.
ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ కార్పొరేషన్ చైర్మన్గా పదవీ బాధ్యతలు చేపట్టిన తమ్ముడు భిక్షపతి ఉద్యమ సమయంలో, ఆ తర్వాత ప్రభుత్వంలో పార్టీ బలోపేతానికి ఎంతో కృషిచేశారన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసినవారికి తప్పక గుర్తింపు ఉంటుందనే దానికి భిక్షపతి చక్కటి ఉదాహరణ అన్నారు. పదవీ బాధ్యతలు అప్పగించినందుకు సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపి ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
డీసీఎంస్ చైర్మన్ శివకుమార్, వివిధ మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు పాల్గొన్నారు. హైదరాబాద్లో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్సీ కవితతో కలిసి రాష్ట్ర మహిళ కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మఠం భిక్షపతిని అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. నాంపల్లిలో దివంగత సాయిచంద్ సతీమణి రజినీసాయిచంద్ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్పర్సన్గా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మహి ళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి హాజరై పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.