పాపన్నపేట, సెప్టెంబర్ 7: పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గా భవానీ మాత ఆలయం మూడో రోజు సైతం మూసివేయడంతో రాజగోపురంలోనే అమ్మవారికి పూజలు నిర్వహించారు. మంజీరా నదికి గురువారం వరద తగ్గడంతో వేకువజామునే వేద పండితులు ఆలయంలోనికి వెళ్లి మూలవిరాట్ దుర్గామాతకు అభిషేకం నిర్వహించి ఆలయాన్ని మళ్లీ మూసివేశారు. ఆలయంలో భక్తులకు మాత్రం ప్రవేశం కల్పించలేదు. దీంతో యధావిధిగా భక్తులు రాజగోపురంలోనే దర్శనం చేసుకున్నారు. శుక్రవారం నాటికి నీటిమట్టం పూర్తిగా తగ్గితే ఆలయాన్ని పునః ప్రారంభించి భక్తులకు దేవాలయంలోకి అనుమతి ఇస్తామన్నారు.