రామాయంపేట, డిసెంబర్ 6 : ‘మనఊరు-మనబడి’ పనులు నాణ్యతగా ఉండాలని, సకాలంలో బిల్లులు అందజేస్తామని మెదక్ డీఈవో రమేశ్కుమార్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 18 ప్రభుత్వ పాఠశాలల హెచ్ఎంలు, ఎస్ఎంసీ చైర్మన్లు, సర్పంచ్, కాంట్రాక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ‘మనఊరు-మనబడి’ పనులపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. మం డలంలోని 18 ప్రభుత్వ పాఠశాలలకు ప్రభుత్వం ‘మనఊరు-మనబడి’ కింద నిధులు కేటాయించిందన్నారు.
ము మ్మరంగా పనులు కొనసాగేలా ఏఈలు, పాఠశాలల హె చ్ఎం, గ్రామాల సర్పంచు లు, ఎస్ఎంసీ కమిటీ సభ్యు లు చొరవ తీసుకోవాలన్నా రు. ‘మనఊరు-మనబడి’ ప నుల గురించి హెచ్ఎంలను అడిగి తెలుసుకున్నారు. సమీక్షా సమావేశంలో సీఎంవో సూర్యప్రకాశ్, ఎంఈవో నీలకంఠం, ఎంపీడీవో ఉమాదేవి, ఏఈలు కుషాల్, విజయ్, మండల నోడల్ ఆఫీసర్ శ్రీనివాస్, సీఆర్పీలు సంతోష్, రాజు, శంకర్, రజిత పాల్గొన్నారు.