‘మనఊరు-మనబడి’లో పనులు పూర్తయిన పాఠశాలలను బుధవారం ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రారంభించారు. ఈ కార్యక్రమం పండుగ వాతావరణంలో సాగింది. న్యాల్కల్ మండలంలో జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీరెడ్డి, కలెక్టర్ శరత్, జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు ప్రారంభించారు. అల్ల్లాదుర్గం మండలంలోని కాయిదంపల్లి, వట్పల్లి మండలంలోని నాగులపల్లి, మునిపల్లి మండలంలోని మేళసంగంలో ప్రభుత్వ పాఠశాలలను అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ప్రారంభించారు. చిన్నశంకరంపేట మండలంలోని గటగట్లపల్లిలో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ప్రారంభించారు. శివ్వంపేట మండలంలోని పిల్లుట్ల, హత్నూర మండలం బోర్పట్లలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి, పటాన్చెరు మండలం ఇస్నాపూర్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలను చూసి విద్యార్థులు, టీచర్లు మురిసిపోయారు.
ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు
మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి
చిన్నశంకరంపేట, ఫిబ్రవరి 1: ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ మనఊరు-మనబడి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని మెదక్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. బుధవారం చిన్నశంకరంపేట మండల పరిధిలోని గటగట్లపల్లిలో మనఊరు-మనబడిలో పనులు పూర్తి ప్రభుత్వ పాఠశాలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి విద్యార్థులతో కలిసి నృత్యం చేసి విద్యార్థులను ఉత్తేజపరిచారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో భోజనశాల ఏర్పాటుకు రూ.5 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మెదక్ డీఈవో రమేశ్కుమార్, డీఈ పాండురంగారెడ్డి, జడ్పీటీసీ పట్లోరి మాధవి, రైతుబంధు మండలాధ్యక్షుడు లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాజు, ఎంపీడీవో ప్రవీణ్, ఎంఈవో యాదగిరి, సర్పంచ్ అవుసుల మీనా రవీందర్, నోడల్ అధికారి విశ్వనాథం, ఎస్ఎంసీ చైర్మన్ సంతోష్కుమార్, ప్రధానోపాధ్యాయుడు ప్రణీత్కుమార్, బీఆర్ఎస్ నాయకుడు రవీందర్, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు పూలపల్లి యాదగిరి యాదవ్, చైర్మన్ శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కార్పొరేట్ను తలపించేలా అభివృద్ధి
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి
పటాన్చెరు, ఫిబ్రవరి 1: మనఊరు-మనబడితో పాఠశాల విద్యకు మహర్దశ వచ్చిందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు మండలం ఇస్నాపూర్లో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మనఊరు-మనబడిలో రూ.51లక్షలతో చేపట్టిన పనులను ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన పాఠశాలను పరిశీలించారు. చక్కటి పరిసరాలు, నిర్మాణం, అద్భుతమైన పెయింటిం గ్స్, మూత్రశాలలు, కిచెన్, ఆర్వో ప్లాంట్, ఫర్నిచర్ను పరిశీలించి సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ సుష్మశ్రీవేణుగోపాల్రెడ్డి, జడ్పీటీసీ సుప్రజావెంకట్రెడ్డి, సర్పంచ్ బాలామణి శ్రీశైలం, ఎంపీటీసీలు అంజిరెడ్డి, గడ్డం శ్రీశైలం, ఉప సర్పంచ్ శోభాకృష్ణారెడ్డి, నియోజకవర్గ ప్రత్యేక అధికారి శ్రీనివాస్రావు, ఎంపీడీవో బన్సీలాల్, పంచాయతీరాజ్ డీఈ సురేశ్, ఎంఈ వో పీపీ రాథోడ్, బీఆర్ఎస్ నాయకులు దశరథరెడ్డి, వెంకట్రెడ్డి, కార్యదర్శి మధుసూదన్రెడ్డి, కృష్ణ, గోవర్ధన్రెడ్డి, భూషణం తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ బడుల స్వరూపాన్ని మార్చడమే లక్ష్యం
రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి,
నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి
శివ్వంపేట/ హత్నూర, ఫిబ్రవరి 1: రాష్ట్ర ప్రభుత్వం మనఊరు-మనబడితో ప్రభుత్వ పాఠశాలల స్వరూపాన్ని మార్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నదని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి అన్నారు. బుధవారం మనఊరు-మనబడి కింద పనులు పూర్తి చేసుకున్న శివ్వంపేట మండలం పిల్లుట్ల ప్రాథమిక పాఠశాలను బుధవారం వారు ప్రారంభించారు. హత్నూర మండలం బోర్పట్ల ప్రభుత్వ పాఠశాల భవనాన్ని ఎమ్మెల్యే మదన్రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో శివ్వంపేట ఎంఈ వో బుచ్యానాయక్ మాట్లాడుతూ మండలంలో మొత్తం 26 పాఠశాలలకు రూ.13.15కోట్లు మంజూరయ్యాయని తెలిపారు.
అంతకుముందు పిల్లుట్లలో మిషన్భగీరథ కింద 60వేల లీటర్ల సామర్థ్యంతో రూ.57.38 లక్షలతో నిర్మించిన ట్యాంకును మహిళా కమిషన్ చైర్పర్సన్, ఎమ్మెల్యే ప్రారంభించారు. శివ్వంపేట కార్యక్రమంలో ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, జడ్పీటీసీ పబ్బ మహేశ్గుప్తా, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మన్సూర్, ఆత్మకమిటీ చైర్మన్ గొర్రె వెంకట్రెడ్డి, పిల్లుట్ల సర్పంచ్ పెద్దపులి రవి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమణాగౌడ్, బీఆర్ఎస్ నేతలు లాయక్, సిలువేరు వీరేశం, నర్సింహరెడ్డి, బండారి గంగాధర్, చింతస్వామి, ఆంజనేయులుగౌడ్, షేక్అలీ, హెచ్ఎం రవీందర్, ఎస్ఎంసీ చైర్మన్ వెంకటేశ్, హత్నూర కార్యక్రమంలో జడ్పీటీసీ ఆంజనేయులు, సర్పంచ్ అంజమ్మ, ఎంపీటీసీ వీరస్వామి, పీఏసీఎస్ చైర్మన్ దుర్గారెడ్డి, నాయకులు శ్రీనివాస్రెడ్డి, అశోక్గౌడ్, శ్రీనివాస్గౌడ్, రాజేందర్, బుచ్చిరెడ్డి, కిశోర్, కృష్ణాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కార్పొరేట్ స్థాయిలో సదుపాయాల కల్పన
సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీరెడ్డి
జహీరాబాద్/ న్యాల్కల్, ఫిబ్రవరి 1: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మనఊరు-మనబడి కార్యక్రమం ద్వారా గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోయాయని సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీరెడ్డి అన్నారు. బుధవారం మనఊరు-మనబడిలో భాగంగా పునరుద్ధరణ పనులు పూర్తి చేసుకున్న జహీరాబాద్ మండలం రంజోల్ ప్రాథమిక పాఠశాలను, న్యాల్కల్ మండలం మండలంలోని మెటల్కుంట జిల్లా పరిషత్, మండల పరిషత్, ప్రాథమిక పాఠశాలలో మనఊరు-మనబడి కింద రూ.1.30 కోట్లతో అభివృద్ధి పనులు పూర్తి చేసుకోగా సంగారెడ్డి కలెక్టర్ శరత్, జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావుతో కలిసి ప్రారంభించారు. స్థానిక పాఠశాల ఆవరణలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన సరస్వతీదేవి విగ్రహాన్ని ప్రారంభించి, ప్రత్యేక పూజలు చేశారు.
బాజాభజంత్రీలు, పాఠశాల విద్యార్థుల బ్యాండ్మేళాలతో ఘనంగా స్వాగతం పలికారు. పాఠశాల విద్యార్థిని నిక్షిత నృత్యప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. అనంతరం కలెక్టర్ శరత్ మాట్లాడుతూ మనఊరు-మనబడిలో సకల సదుపాయాలున్న మెటల్కుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకోవాలని ఉందన్నారు. విశాలమైన పాఠశాల ఆవరణలో మొక్కలు పెంచేందుకు పంచాయతీ పాలకవర్గం, పాఠశాల ఉపాధ్యాయులు, కమిటీ సభ్యులు కృషి చేయాలన్నారు. విద్యార్థులకు మౌలిక వసతులను కల్పించి, విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న ప్రధానోపాధ్యాయుడు ప్రభాకర్ కులకర్ణి సేవలను కొనియాడారు. మనఊరు-మనబడి పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి, మెరుగైన విద్యనందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని సంగారెడ్డి జిల్లా విద్యాధికారి నాంపల్లి రాజేశ్ అన్నారు.
జిల్లాలో 1262 ప్రభుత్వ పాఠశాలలున్నాయని, మొదటి విడతలో 441 పాఠశాలలు ఎంపిక చేసిందన్నారు. పాఠశాలలో 12 రకాల సదుపాయాలను కల్పించేందుకు రూ.210 కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోనే మనఊరు-మనబడి కార్యక్రమం కింద రూ.1.30 కోట్లతో మౌలిక సదుపాయాలను కల్పించిన మెటల్కుంట జిల్లా పరిషత్, మండల పరిషత్, ప్రాథమిక ఉర్దూ మీడియం పాఠశాలలు ప్రారంభించుకున్నామన్నారు. జహీరాబాద్ కార్యక్రమంలో జడ్పీసీఈవో, నియోజకవర్గ ప్రత్యేక అధికారి ఎల్లయ్య, ఆత్మ కమిటీ చైర్మన్ పెంటారెడ్డి, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు సయ్యద్ మోహినొద్దీన్, రంజోల్ బీఆర్ఎస్ నాయకులు సత్యనారాయణ ముదిరాజ్, పంచాయతీరాజ్ డీఈ ప్రవీణ్కుమార్, ఏఈ కోటేశ్వర్రావు, న్యాల్కల్ కార్యక్రమంలో జడ్పీ సీఈవో ఎల్లయ్య, పీఆర్ ఈఈ జగదీశ్వర్, డీఈఈ ప్రవీణ్కుమార్, మండల ప్రత్యేకాధికారి రాఘవరావు, ఆర్డబ్ల్యూఎస్ డీఈ సాబేర్హుస్సేన్, డిప్యూటీ తహసీల్దార్ విజయలక్ష్మి, ఎంపీడీవో వెంకట్రెడ్డి, పీఆర్ఏఈ కృష్ణ జోషి, ఎంఈవో మారుతీరాథోడ్, జహీరాబాద్ ఆత్మకమిటీ చైర్మన్ పెంటారెడ్డి, జడ్పీటీసీ స్వప్నకుమారి, ఎంపీపీ అంజమ్మ, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రవీందర్, నాయకులు పాండురంగారెడ్డి, నర్సింహరెడ్డి, బస్వరాజ్పాటిల్, రాజేంధర్రెడ్డి, సర్పంచులు పీటర్రాజ్, మహిపాల్, రవికుమార్, చంద్రన్న, లక్ష్మి, కుత్బుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
సర్కారు స్కూళ్లకు కార్పొరేట్ లుక్కు..
అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్
అల్లాదుర్గం/ మునిపల్లి/ వట్పల్లి, ఫిబ్రవరి 1: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మనఊరు-మనబడి కార్యక్రమంతో సర్కారు బడులు కార్పొరేట్ను తలదన్నేలా మారాయని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. బుధవారం మనఊరు-మనబడిలో పనులు పూర్తి కావడంతో అల్లాదుర్గం మండలం కాయిదంపల్లి ప్రాథమిక పాఠశాల, మునిపల్లి మండల పరిధిలోని మేళసంగం ప్రభుత్వ పాఠశాల, వట్పల్లి మండలం నాగులపల్లి ప్రభుత్వ పాఠశాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ను మునిపల్లి ఎంఈవో దశరథ్ పూలమాల, శాలువాతో ఘనంగా సన్మానించారు.
అల్లాదుర్గం కార్యక్రమంలో ఎంపీపీ అనిల్కుమార్రెడ్డి, మాజీ ఎంపీపీ కాశీనాథ్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు అంజియాదవ్, స్థానిక సర్పంచ్ బేతయ్య, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నర్సింలు, ఎంపీడీవో విజయభాస్కర్రెడ్డి, హెచ్ఎంలు ధనుంజయ, జనార్దన్, రాంజ్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు. మునిపల్లి కార్యక్రమంలో ఎంపీపీ శైలజాశివశంకర్, జడ్పీటీసీ మీనాక్షిసాయికుమార్, వైస్ ఎంపీపీ ఖమ్రోద్దీన్, మేళసంగం సర్పంచ్ శ్రీనివాస్, మండల కో-ఆప్షన్ సభ్యులు సలావుద్దీన్, నాయకులు సాయికుమార్, శివశంకర్, నవాజ్రెడ్డి, చంద్రయ్య తదితరులు ఉన్నారు. వట్పల్లి కార్యక్రమంలో ఎంపీపీ కృష్ణవేణి, జడ్పీటీసీ ఆపర్ణ, వైస్ ఎంపీపీ నాగరాణి, సర్పంచ్ నారాయణగౌడ్, ఎంఈవో కృష్ణ, ఎంపీడీవో జగదీశ్వర్, ఎంపీవో యూసుఫ్, వరం అధ్యక్షుడు వీరారెడ్డి, నాయకులు నారాయణ, రాజు, యాదయ్య, ఉపాధ్యాయులు రాములు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.