హవేళీఘనపూర్/మనోహరాబాద్,డిసెంబర్ 5 : ఎదురెదురుగా వస్తున్న కారు- లారీ ఢీకొన్న సంఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురికి తీవ్రగాయాలైన సంఘటన మండల పరిధిలోని స్కూల్ తండా వద్ద చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని స్కూల్ తండాకు చెందిన లకావత్ గణేశ్ (27), సక్రమ్, జాలి, రమేశ్, లింగి కలిసి కారులో మెదక్ మండలం పాతూరులో ఓ విందుకు వెళ్లారు. దీంతో పాతూరు నుంచి స్కూల్ తండా వైపు కారులో వస్తుండగా మెదక్ వైపు నుంచి లారీ కారును ఢీకొనడంతో కారులో ఉన్న గణేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని మెదక్ ఏరియా దవాఖానకు తరలించి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మనోహరాబాద్లో..
మనోహరాబాద్ మండలం రామాయిపల్లి బిడ్జి వద్ద సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్లోని సుల్తాన్బజార్కు చెందిన దొంగారి భోజేందర్ కుమార్ (20) కారులో మనోహరాబాద్ మీదుగా నిజామాబాద్ వెళ్తున్నాడు. మార్గమధ్యలో రామాయిపల్లి బిడ్జి సమీపంలో కారు డివైడర్ను వేగంగా ఢీకొన్నది. ఈ ప్రమాదంలో భోజేందర్ కుమార్ అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజుగౌడ్ తెలిపారు.