గజ్వేల్ అర్బన్, ఏప్రిల్ 2: ‘దేశ్ కీ నేత కైసా హో…. కేసీఆర్ కే జైసా హో’ అంటూ మరాఠా రైతులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఆదివారం సిద్దిపేట జిల్లా పర్యటనలో భాగంగా గజ్వేల్ వెజ్, నాన్వెజ్ మార్కెట్ను మహారాష్ట్ర రైతు సంఘాల నాయకులు సందర్శించారు. సమీకృత మార్కెట్కు చేరుకున్న ఆదిలాబాద్ ఎమ్మెల్సీ విఠల్తో పాటు మహారాష్ట్ర రైతు సంఘాల నాయకులు, రైతులకు ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, వైస్ చైర్మన్ ఉపేందర్ రెడ్డి, డైరెక్టర్లు ఘనస్వాగతం పలికారు.
ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, ఏఎం సీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ సమీకృత మార్కెట్ నిర్మాణం, కూరగాయలు, మాం సం, చేపలు, పండ్లు,పూల దుకాణాల గురించి వివరించారు. పరిశుభ్రమైన వాతావరణంలో కూరగాయలు, పండ్లు, మాంసం విక్రయించడానికి రైతు లు, వ్యాపారులకు సౌకర్యంగా, ప్రజలందరికీ అన్ని ఒకేచోట లభించేలా, అన్ని సౌకర్యాలు కల్పిస్తూ సమీకృత మార్కెట్ను సీఎం కేసీఆర్ నిర్మించారని ప్రతాప్రెడ్డి, మాదాసు శ్రీనివాస్ వివరించారు. సమీకృత మార్కెట్ను సిబ్బంది, మున్సిపాలిటీని పారిశుధ్య కార్మికులు ఎల్లవేళలా పరిశుభ్రంగా ఉంచుతున్నట్లు తెలిపారు. సీఎం గజ్వేల్ నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలోని 140 మున్సిపాలిటీ ల్లో ఇలాంటి సమీకృత మార్కెట్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. గతంలో రోడ్లపై ధుమ్ము, ధూళిలో, దుర్గంధ వాతావరణంలో కూరగాయలు విక్రయించగా, ఇప్పుడు పరిశుభ్రమైన వాతావరణంలో స్వ చ్ఛమైన, తాజా కూరగాయలను విక్రయిస్తున్నట్లు చెప్పారు.
చప్పట్లు కొట్టి.. మద్దతు తెలిపి…
రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల్లో ఇంటింటికీ వెళ్లి పారిశుధ్య కార్మికులు చెత్త సేకరిస్తూ పట్టణాలు, గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దుతున్నారని మహారాష్ట్ర బృందానికి వంటేరు ప్రతాప్రెడ్డి, మాదాసు శ్రీనివాస్ తెలిపారు. ఇంటింటికీ తాగునీరు, రైతుబంధు కింద రైతుకు ఎకరానికి రూ.10వేల చొప్పున సాయం అందిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో రైతులను అభివృద్ధి చేయడానికి సీఎం కేసీఆర్ రైతుబంధు, రైతుబీమా పథకాలు, 24గంటల ఉచిత విద్యుత్ను అందిస్తున్నారని, సాగునీటి కోసం కొండపోచమ్మ, మల్లన్నసాగర్ లాంటి అనేక ప్రాజెక్టులు నిర్మించారని తెలిపారు. రైతు ఏ విధంగా చనిపోయినా ఆ కుటుంబానికి 10రోజుల వ్యవధిలో రైతుబీమా కింద రూ.5లక్షల మొత్తం అందిస్తున్నట్లు తెలిపారు. రైతుబీమా ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తున్నదన్నారు. గజ్వేల్ మున్సిపాలిటీలో వ్యవసాయ మార్కెట్, సమీకృత మార్కెట్, ఐవోసీ, ఎడ్యుకేషన్ హబ్లు, మహతి ఆడిటోరియం తదితర గొప్పగొప్ప భవనాలను సీఎం కేసీఆర్ నిర్మించిన విషయాన్ని వారికి వివరించారు.
సీఎం కేసీఆర్ అందిస్తున్న చేయూతతో వ్యవ సాయం పండుగలా మారిందని ,రైతు ఆత్మహత్య లు బాగా తగ్గాయన్నారు. తెలంగాణలో రైతు అభివృద్ధి జరిగిన విధంగానే దేశంలోని రైతులందరినీ అభివృద్ధి చేయడానికి బీఆర్ఎస్ ద్వారా సీఎం కేసీఆర్ దేశరాజకీయాల్లో అడుగుపెట్టారని మహారాష్ట్ర బృందానికి వంటేరు ప్రతాప్రెడ్డి, మాదాసు శ్రీనివాస్ తెలియజేశారు. తెలంగా ణ పాలన, స్కీమ్లు తెలుసుకున్న మహారాష్ట్ర రైతు ప్రతినిధులంతా చప్పట్లు కొడుతూ అభివాదం చేశారు. దేశ్ కీ నేత కైసా హో…. కేసీఆర్ కే జైసా హో అంటూ మహారాష్ట్ర గజ్వేల్ సమీకృత మార్కె ట్ దద్దరిల్లేలా నినాదాలు చేశారు. కౌన్సిలర్ గోపాల్రెడ్డి, గజ్వేల్ ఏఎంసీ కార్యదర్శి జాన్వెస్లీ, డైరెక్టర్లు నర్సింలు, మతిన్, ప్రవీణ్, రాజిరెడ్డి, సాయిరెడ్డి, సూపర్వైజర్ మహిపాల్, నాయకులు రమేశ్గౌడ్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
మహారాష్ట్రకు కేసీఆర్ లాంటి నాయకుడు అవసరం..
సీఎం కేసీఆర్ లాంటి నాయకుడి అవసరం మహారాష్ట్రకు ఎంతైనా ఉంది. మహారాష్ట్రలో ఈసారి కిసాన్ సర్కారే అధికారంలోకి వస్తుంది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు, ఢిల్లీ నుంచి గుజరాత్ వరకు వెళ్లినా. కానీ. గజ్వేల్లోని సమీకృత మార్కెట్ లాంటిది చూడలేదు. తెలంగాణలో అట్లా జరిగింది, ఇట్లా జరిగిందంటూ గొప్పగా విన్నాను. కానీ, స్వయంగా చూస్తేనే తెలిసింది ఎంత అద్భుతమైన అభివృద్ధి జరిగిందో. ఇక్కడి అభివృద్ధి చూడడానిని నా రెండు కండ్లు చాలలేదు. మహారాష్ట్రలోనూ ఇలాంటి అభివృద్ధి జరగాలి. మా దగ్గర ఉన్న చేపల మార్కెట్లో చేపల కన్నా ఈగలే ఎక్కువగా కనిపిస్తాయి. ఇక్కడ గజ్వేల్లో పరిశుభ్ర వాతావరణంలో చేపలు, మాంసం విక్రయాలు జరుగుతున్నాయి. ఇంతటి గొప్ప మార్పు మా రాష్ట్రంలోనూ జరగాలని కోరుకుంటున్నాము. ఈసారి మా రైతుల కోసం కచ్చితంగా బీఆర్ఎస్ రైతు ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. – పవన్, మహారాష్ట్ర రైతు నాయకుడు