మెదక్ : మహర్షి వాల్మీకి మహనీయుడిని మనసారా స్మరించుకొని మందుకు సాగాలని జిల్లా కలెక్టర్ ఎస్.హరీశ్ అన్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఆవరణలో అధికారికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ప్రతిమసింగ్, రమేశ్లతో కలిసి జ్యోతి ప్రజ్వలన గావించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామాయణ మహాకావ్యాన్ని రచించి మనకందించిన మహనీయుడు మహర్షి వాల్మీకి అని పేర్కొన్నారు. చెడు మార్గం నుంచి దైవికం వైపు మరలి 24వేల శ్లోకాలతో సంస్కృతంలో రామాయణాన్ని ప్రామాణికతగా ఉందని అన్నారు.
రామకథ విన్నా, చదివినా పుణ్యం వస్తుందని తెలిపారు. భారత దేశం, ప్రపంచం ఉన్నన్ని రోజులు మహర్షి వాల్మీకి చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో శ్రీనివాస్, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి జగదీశ్, డీఎస్వో శ్రీనివాస్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దేవయ్య, జిల్లా యువజన క్రీడల అధికారి నాగరాజు, అడిషనల్ డీఆర్డీవో బీమయ్య, వాల్మీకి బోయ సంఘం జిల్లా అధ్యక్షుడు స్వామి, ఉపాధ్యక్షులు కె.స్వామి, కార్యదర్శి శ్రీనివాస్, మల్లారీ, నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.