మెదక్, డిసెంబర్ 17(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం లగచర్ల రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లా కేంద్రంలోని దాయర వీధిలో ఉన్న అంబేదర్ విగ్రహానికి పూలమాల వేసి మాజీఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, మెదక్ మారెట్ కమిటీ మాజీ చైర్మన్లు బట్టి జగపతి, ఆకిరెడ్డి కృష్ణారెడ్డి, మెదక్ మున్సిపల్ వైస్చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, పార్టీ పట్టణ కన్వీనర్, కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు, బీఆర్ఎస్ పట్టణ శ్రేణులతో కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు అంబేదర్ విగ్రహానికి పూలమాల వేసి వినతిపత్రం సమర్పించామని పేరొన్నారు. లగచర్ల రైతులపై థర్డ్ డిగ్రీ ఉపయోగించి, జైలులో పెట్టడం సరైనది కాదన్నారు. రైతుల చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎకడికకడ ప్రజలు నిలదీయాలన్నారు. నిరంకుశ పాలనను నిరసిస్తూ ప్రజలంతా అన్నదాతలకు మద్దతు తెలుపాలన్నారు.
కాంగ్రెస్ అమాననీయ, అణచివేత ధోరణిని నిరసిస్తూ రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి, జైలులో నిర్బంధించిన రైతులను విడుదల చేసే వరకు పోరాటం చేస్తామన్నారు. రైతు లేనిది రాజ్యం లేదన్నారు. రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామన్నారు. కార్యక్రమంలో కో కన్వీనర్లు లింగారెడ్డి, కృష్ణ గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్ కొట్టాల విశ్వం, వంజరి జయరాజు, భీమరి కిశోర్, ఆరే శ్రీనివాస్, నాయకులు ప్రభు రెడ్డి, మాయ మల్లేశం, రాజు, చంద్రశేఖర్ గౌడ్, శంకర్, సంగ శ్రీకాంత్, కృష్టయ్య, కిషన్, గట్టేశ్, మ్యాకల సాయిలు, రామచంద్రరెడ్డి, సాప సాయిలు, శ్రీనివాస్ రెడ్డి, మోహన్ రాథోడ్, షాకీర్, ప్రభాకర్, లక్ష్మణ్, ముకుందాం, దశరథం, మహేశ్, కిరణ్, భువన్ తదితరులు పాల్గొన్నారు.