నర్సాపూర్, మార్చి 6: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఒక మాట, వచ్చాక ఒకమాట మాట్లాడుతున్నదని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ధ్వజమెత్తారు. ఎల్ఆర్ఎస్పై బుధవారం నర్సాపూర్లో ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టి ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కారు ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి 90 రోజులు గడుస్తున్నా కాంగ్రెస్ సర్కారు హామీలను సరిగ్గా అమలు చేయడం లేదని ఆరోపించారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలో వచ్చాక మరోలా ఎల్ఆర్ఎస్పై కాంగ్రెస్ వ్యవహరించడం దుర్మార్గమైన చర్య అని ఆమె విమర్శించారు. ధర్నాలో జడ్పీ కో-ఆప్షన్ మెంబర్ మన్సూర్, మున్సిపల్ చైర్మన్ అశోక్గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్రాగౌడ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు చంద్రశేఖర్, బీఆర్ఎస్ యువ నాయకుడు సంతోశ్రెడ్డి, బీఆర్ఎస్కేవీ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి సిలువేరి వీరేశం, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ శివకుమార్, బీఆర్ఎస్ నాయకులు సత్యంగౌడ్, తొంట వెంకట్, సుధాకర్రెడ్డి, నగేశ్, ఆంజనేయులుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.