అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠను పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా శ్రీరామ నామస్మరణ మార్మోగింది. ఆలయాల్లో తెల్లవారుజామునుంచే ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు, శోభాయాత్రలు, కోలాటాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారుల రామలక్ష్మణుల వేషధారణ అందరినీ ఆకట్టుకున్నాయి.
గజ్వేల్ రామాలయంతో పాటు క్యాసారం ఆలయంలో మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి పాల్గొన్నారు. పలు చోట్ల అన్నదాన కార్యక్రమాలు జరిగాయి.