మనోహరాబాద్, ఫిబ్రవరి 28 : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్షాక్తో కౌలు రైతు మృతి చెందిన సంఘటన మనోహరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి ఎస్ఐ రాజుగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం..మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కొట్టూరి సత్తయ్య గ్రామానికి చెందిన రఘువీరారెడ్డి పొలాన్ని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు.
కాగా సోమవారం ఉదయం పొలం సమీపంలో పశువులను కట్టేసే పాక వద్ద బల్బును సరి చేస్తుండగా విద్యుత్షాక్కు గురై మృత్యువాతపడ్డాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ రాజుగౌడ్ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.