కొండపాక (కుకునూరుపల్లి), మార్చి 12 : ఆరుగాలం శ్రమించి పండించిన పంటలకు నీళ్లు ఇచ్చి ఆదుకోవాలని మంగళవారం సీపీ ఎం కొండపాక ఉమ్మడి మండల కార్యదర్శి అమ్ముల బాల్నర్సయ్య ఆధ్వర్యంలో తహసీల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు ఆరుకాలం శ్రమించి పంట చేతికి వచ్చే సమయంలో భూగర్భజాలాలు తగ్గి పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రభుత్వం వెంటనే దేవాదుల పైపు లైన్ ద్వారా తపాస్పల్లి రిజర్వాయర్ నింపి అనంతరం కొండపాక మండలంలోని చెరువులు, కుంటలు నింపాలన్నారు. తహసీల్దార్ దిలీప్నాయక్కు వినతి పత్రం అందజేశారు. నాయకులు కొమురవెల్లి కనకయ్య, రవీంద్రాచారి, ప్రభాకర్, కనకాచారి, అయిలయ్య, కొమరయ్య, గడ్డమీది అయిలయ్య, నర్స య్య, రాజు పాల్గొన్నారు.
మద్దూరు(ధూళిమిట్ట), మార్చి12: మద్దూ రు, ధూళిమిట్ట మండలాల్లోని చెరువు, కుంటలను గోదావరి జలాలతో నింపాలని కోరుతూ సీపీఎం మండల కమిటీల ఆధ్వర్యంలో మ ద్దూరు, ధూళిమిట్టలో ధర్నాలు నిర్వహించి తహసీల్దార్ అనంతరెడ్డి, ఆర్ఐ ఐలయ్యకు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు రాళ్లబండి శశిధర్, జిల్లా కమిటీ సభ్యుడు చొప్పరి రవికుమార్ మాట్లాడుతూ భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో పొలాలన్నీ ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి ఆలేటి యాదగిరి, నాయకులు ఎండీ షఫీ, పిట్టల నరేశ్, జక్కుల ఎల్లయ్య, పోతిరెడ్డి రాజు, సత్యనారాయణ పాల్గొన్నారు.
సిద్దిపేటరూరల్, మార్చి 13 : సిద్దిపేట రూరల్ మండలంలోని గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎంపీపీ శ్రీదేవీచందర్రావు కోరా రు. మంగళవారం రూరల్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఐదేండ్ల పదవికాలంలో గ్రామాల్లో అనేక అభివృద్ధి పనులు చేశామన్నారు. ప్రభుత్వం అందించే పథకాలు అర్హులకు అందేలా చూ డాలని అధికారులను కోరారు. పంచాయతీల ప్రత్యేకాధికారులు సమన్వయంతో పని చేసి అభివృద్ధి పనులు పూర్తి చేయాలని కోరారు. పలువురు అధికారులు శాఖల నివేదికలను చదివి వినిపించారు. ఈ సందర్భంగా ఎం పీపీ, ఎంపీటీసీలను అధికారులు, తోటి ప్రజాప్రతినిధులు సన్మానించారు. సమావేశంలో ఎంపీడీవో సమ్మిరెడ్డి, వైస్ ఎంపీపీ యాదగిరి, ఎంపీటీసీ లత, తదితరులు పాల్గొన్నారు.
కొమురవెల్లి, మార్చి 12 : గ్రామాల్లో నీటి ఎద్దడి లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలని ఎంపీపీ తలారి కీర్తనాకిషన్ అన్నారు. మంగళవారం కొమురవెల్లి మండల పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ఎంపీటీసీలు పలు సమస్యలను సభ దృష్టి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుందామని, ముఖ్యంగా వేసవిలో నీటి ఎద్దడి రాకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. రైతులకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉం చాలని అధికారులకు సూచించారు. మండల స్పెషల్ ఆఫీసర్, సీడీపీవో శారద, ఎంపీడీవో కుమారస్వామి, డిప్యూటీ తహసీల్దార్ వేణుగోపాల్, వైస్ ఎంపీపీ కాయిత రాజేందర్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.