జహీరాబాద్, మార్చి 20 : సర్కార్ దవాఖానలో గర్భిణులకు, నవజాత శిశువులకు మెరుగైన వైద్య చికిత్స అందించడంతో పాటు నాణ్యతా ప్రమాణాలు పాటించడంతో కేంద్ర ప్రభుత్వం లక్ష్య పురస్కారానికి జహీరాబాద్ దవాఖానను ఎంపిక చేసింది. జాతీయ వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మాతా, శిశు విభాగాల్లో నాణ్యతా ప్రమాణాలు మెరుగైన దవాఖానలను పరిశీలించి ఈ పథకంలో ఎంపిక చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మూడు ప్రాంతీయ దవాఖానలను ఎంపిక చేయగా, వాటిలో జహీరాబాద్ సర్కార్ దవాఖాన మొదటి స్థానంలో ఎంపిక జరిగింది. రెండో స్థానంలో కామారెడ్డి, మూడో స్థానంలో పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖని దవాఖానలు ఎంపిక చేసి లక్ష్య పురస్కారాలు దక్కించుకున్నాయి.
సహజ ప్రసవాలకు ప్రాధాన్యత
జహీరాబాద్ సర్కార్ దవాఖానలకు ప్రసవలకు కోసం వచ్చే గర్భిణులకు వైద్యులు, స్టాప్ నర్సులు పలు ఆంశలపై ఆవగహన కల్పించారు. కేంద్ర ప్రభుత్వం నియమించిన బృం దం నివేదిక సమర్పించి వాటి ని పరిశీలించి తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో జహీరాబాద్ సర్కార్ దవాఖానను ఎంపిక చేశారు.
ప్రతి ఏడాది రూ. 3 లక్షలు
కేంద్ర ప్రభుత్వం లక్ష్య పురస్కారానికి ఎంపిక చేయడంతో మూడు సంవత్సరాల పాటు ప్రతి ఏడాది రూ. 3 లక్షల చొప్పున నిధులు మంజూరు చేస్తుంది. ప్రతి ఏడాది నిధులు మంజూరు కావడంతో లేబర్ రూం, ఆపరేషన్ థియేటర్ను మెరుగైన సౌకర్యలు కలిపించే అవకాశం ఉంది. ప్రసవం కోసం వచ్చే గర్భిణులకు వైద్య పరీక్షలు చేయడంతో పాటు నవజాత శిశువులకు నాణ్యతా ప్రమాణాలతో వైద్య చికిత్సలు చేస్తారు.
చాలా సంతోషంగా ఉంది..
జాతీయ స్థాయిలో జహీరాబాద్ సర్కార్ దవాఖానకు పురస్కారం రావడం సంతోషంగా ఉంది. వైద్య బృందం, సిబ్బంది సమష్టి కృషితో పని చేయడంతో లక్ష్య పురస్కారానికి ఎంపికయ్యాం. రాష్ట్ర ప్రభుత్వం దవాఖానలో సౌకర్యలు కలిపించడంతో గర్భిణులకు, నవజాతి శిశువులకు నాణ్యతా ప్రమాణాలతో వైద్య సేవలు అందిస్తున్నాం. లక్ష్య పురస్కారంలో జహీరాబాద్ సర్కార్ దవాఖాన ఎంపిక కావడంతో జాతీయ వైద్య ఆరోగ్య శాఖ ప్రతి ఏడాది రూ. 3 లక్షల నిధులు మంజూరు చేస్తుంది. నిధులు మంజూరు కాగానే మరిన్ని సౌకర్యాలు కలిపించేందుకు కృషి చేస్తాం.
-డాక్టర్ శేషురావు, సూపరింటెండెంట్ సర్కార్ దవాఖాన, జహీరాబాద్