మెదక్ మున్సిపాలిటీ, జూన్ 10: బీఆర్ఎస్ మెదక్ నియోజకవర్గ ఇన్చార్జి కంఠారెడ్డి తిరుపతిరెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు ఆశీర్వదించారు. తిరుపతిరెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా మంగళవారం కేటీఆర్, హారీశ్రావులను హైదరాబాద్లోని వారి నివాసాల్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు కేక్ కట్ చేయించి తిరుపతిరెడ్డిని శాలువాలతో ఘనంగా సన్మానించి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో బీఆర్ఎస్ పట్టణ కన్వీనర్ మామిళ్ల అంజనేయలు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జన్మదినం వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ దవాఖానలోని రోగులకు పండ్లు, బ్రేడ్ పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో బీఆర్ఎస్ నేతలు చంద్రమోహన్గౌడ్, నయీం, గౌష్ఖురేషి, జయరాజు, మధు, కిరణ్, రాములు, నాగరాజు, సుఫీ, నవీన్, కిష్టయ్య, బాలేష్, రవీందర్, కిరణ్గౌడ్, మాయ మల్లేశం, అంజనేయులు, సతీశ్రావు, రంజీత్, మంగ్యనాయక్ తదితరులు పాల్గొన్నారు.