జహీరాబాద్, సెప్టెంబర్ 13: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ ఎల్లప్పుడూ అండగా ఉంటారని ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు అన్నారు. బుధవారం జహీరాబాద్లోని ఓ ఫంక్షన్ హాలులో దివ్యాంగుల ఆసరా పథకం పింఛన్ పెంపు మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలోని దివ్యాంగులకు రూ.4,016 పింఛన్ లభిస్తున్నదని వివరించారు. గతంలో రూ.3016 పింఛన్ ఉండేదని సీఎం కేసీఆర్ మంచి మనసుతో మరో రూ.వెయ్యి పెంచారని కొనియాడారు. దివ్యాంగులకు పింఛన్తో పాటు వాహనాలు అందించామన్నారు. అనంతరం సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
తెలంగాణ ఏర్పాటుతో ప్రజలందరికీ న్యాయం జరుగుతున్నదని బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, జహీరాబాద్ బీఆర్ఎస్ సమన్వయ కన్వీనర్ దేవీప్రసాద్ అన్నా రు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులతో పాటు అర్హులైన ప్రతిఒక్కరికీ పింఛన్లు అందిస్తున్నారన్నారు. ప్రభుత్వ పథకాలు పొందిన ప్రతిఒక్కరూ బీఆర్ఎస్కు మద్దతు తెలుపాలని కోరారు. నియోజకవర్గంలోని 3,500 మం ది దివ్యాంగులకు రూ.1,40,56,000 చెక్కు అందజేశారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నరోత్తం, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.