Students Protest | మెదక్, ఏప్రిల్ 7(నమస్తే తెలంగాణ): గిరిజన గురుకుల పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలో ఉన్న బాలుర గిరిజన ఆశ్రమ గురుకుల పాఠశాల విద్యార్థులు మంగళవారం ఉదయం జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు.
మెనూ ప్రకారం భోజనం అందించాల్సి ఉండగా.. నాణ్యత లేని ఆహారం పెడతుున్నారని విద్యార్థులు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. మంచి భోజనం పెట్టాలని ప్రశ్నిస్తే కొడుతున్నారని.. బెదిరిస్తున్నారని తెలిపారు. ఈ సమస్యను ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఎవరూ స్పందించకపోవడం వల్ల రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నామని చెప్పారు.

Kowdipally2
నాణ్యత లేని భోజనం గురించి ప్రశ్నించినందుకు ఉపాధ్యాయుడు కొడుతున్నాడని.. ఈ విషయంలో ప్రిన్సిపల్ అతన్ని వెనుకేసుకొస్తున్నాడని విద్యార్థులు తెలిపారు. గిరిజన పాఠశాలలో అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న ప్రిన్సిపల్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Kowdipally3