దుబ్బాక, జూన్ 14 : పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన దుబ్బాక నియోజకవర్గంలో కొత్తగా గోదాముల నిర్మాణం చేపట్టాలని స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ఆదివారం వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి వినతిపత్రం అందజేశారు. దుబ్బాక ని యోజకవర్గంలో 5 వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉన్నాయని, ప్రతి మార్కెట్ యార్డులో 40వేల మెట్రిక్ టన్నుల అదనపు నిల్వ సామ ర్థ్యం కల్పిస్తూ, మొత్తం 2 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల ఆధునిక గోదాము లు మంజూరు చేయాలని మంత్రిని కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
రైతులకు యూరియా, దుక్కి మందు, పురుగు మందులతో పాటు నాణ్యమైన విత్తనాలు సకాలంలో అం దుబాటు ధరల్లో లభించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. యాసంగిలో రైతులు పండించిన వడ్లు నిల్వ చేసేందుకు సరిపడా గోదాంలు లేక రైతులు, అధికారులు ఇబ్బందులు పడ్డారని, ధాన్యం సేకరణకు అధికార యంత్రాంగం, ధాన్యం నిల్వ చేసేందుకు రైస్మిల్లర్లు ఇబ్బందులు పడ్డారని, కాబట్టి వచ్చే వానకాలం నాటికి కొత్తగా గోదాములు అందుబాటులోకి తేవాలని మంత్రికి విజ్ఞప్తి చేసినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.