దుబ్బాక,ఫిబ్రవరి 9 : దుబ్బాక అభివృద్ధి కోసం పట్టణ ప్రజలంతా ఒక్కసారి ఆలోచించి ఓటువేయాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకునేందుకు కారు గుర్తుకు ఓటువేయాలని కోరారు. దుబ్బాక మున్సిపల్ ఎన్నికల నేపథ్యంతో సోమవారం రాత్రి ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్తోనే దుబ్బాక ము న్సిపల్ అభివృద్ధి సాధ్యమన్నారు. రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో దుబ్బాక అభివృద్ధి జరగలేదన్నారు. దుబ్బాక అంటే కేసీఆర్కు ఎంతో అభిమానం, ఆయన ప్రత్యేక చొరవతోనే అద్భుతమైన బాలాజీ దేవాలయం, కేసీఆర్ బడి , రామసముద్రం చెరువుకట్ట సుం దరీకరణ, వంద పడకల దవాఖాన , మో డల్ బస్టాండ్ భవనం నిర్మించుకున్నామని గుర్తుచేశారు.
మల్లన్నసాగర్ ప్రాజెక్టుతో నియోజకవర్గ రైతులకు సాగునీటి కష్టాలు తీర్చిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు. దుబ్బాకలో చాలా మంది బీడీ, చేనే త, గీత కార్మికులు ఉన్నారని, వారందరికీ అండగా ఉంటూ ఆసరా పింఛన్లు మంజూరు చేశారని గుర్తు చేశారు. అభివృద్ధి, సంక్షేమానికి మారుపేరుగా బీఆర్ఎస్ ప్రభుత్వం నిలిస్తే.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందన్నారు. బీజేపీ నా యకుల మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. మళ్లీ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ నా యకులు ఎల్లారెడ్డి, శ్రీనివాస్, నరేశ్ పాల్గొన్నారు.