దుబ్బాక, డిసెంబర్ 13: దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి మెదక్ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని బుధవారం ఢిల్లీలో లోక్సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లాను కలిసి అందజేశారు. పదేండ్లుగా మెదక్ ఎంపీగా ఉంటూ, ప్రజలకు చేసిన సేవలతో పాటు అభివృద్ధి పనులు, పార్లమెంట్తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. సహకరించిన ప్రతిఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.