మెదక్ అర్బన్/ చిన్నశంకరంపేట/ పెద్దశంకరంపేట/ చేగుంట, సెప్టెంబర్ 27 : బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, తెలంగాణ తొలిదశ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఎస్పీ రోహిణిప్రియదర్శిని అన్నారు. లక్ష్మణ్ బాపూజీ జయంతి పురస్కరించుకొని బుధవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ ఆధ్వర్యంలో బాపూజీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆర్ఐ నాగేశ్వర్, ఎస్బీసీఐ సందీప్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చిన్నశంకరంపేటలో కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటా నికి పద్మశాలీ సంఘం నాయకులు డాక్టర్ సత్యనారాయణ, వనం నర్సింహులు తదితరులు నివాళులర్పించారు.
బాపూజీ సేవలు చిరస్మరణీయమని ఎంపీపీ శ్రీనివాస్ అన్నారు. పెద్దశంకరంపేట మండల పరిషత్ కార్యాలయంలో కొండాలక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు దత్తు, వీణాసుభాశ్గౌడ్, పద్మశాలీ సంఘం మండలాధ్యక్షుడు గుజ్జరి కనకరాజు, నాయకులు గుజ్జరి అనిల్, పల్లె రవి, పడాల రవి, మహంకాళి కృష్ణమూర్తి, లింగం, మల్లేశం, వెంకట్రాములు పాల్గొన్నారు.