జనవరి 5 : కొమురవెల్లి మల్లికార్జునస్వామి కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించేందుకు ఆలయవర్గాలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి తెలిపారు. శుక్రవారం కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ఆయన పర్యటించి కల్యాణవేదిక, గ్యాలరీలు, పోలీస్ బందోబస్తు తదితర వాటిని పరిశీలించారు. అనంతరం క్యూలైన్లు పరిశీలించి ఆలయ ఈవో బాలాజీకి సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ రాజకీయాలకతీతంగా కొమురవెల్లి మల్లన్న కల్యాణం నిర్వహించేందుకు తాము పూర్తి స్థాయిలో సహకరిస్తామన్నారు. ఆయన వెంట జడ్పీటీసీ సిలువేరు సిద్ధప్ప,బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గీస భిక్షపతి, పీఏసీఎస్ చైర్మన్ వంగ చంద్రారెడ్డి, ఉపసర్పంచ్ కొండా శ్రీధర్, బీఆర్ఎస్ నాయకులు సార్ల కిష్టయ్య, మెరుగు శ్రీనివాస్గౌడ్, తలారీ కిషన్, పడిగన్నగారి మల్లేశం, గొల్లపల్లి కిష్టయ్య, మేక సంతోష్, రసులాబాద్ సర్పంచ్ పచ్చిమడ్ల స్వామి, ముత్యం నర్సింహులు, మెరుగు కృష్ణ, జింకల పర్వతాలు, దుబ్బుడు వేణుగోపాల్రెడ్డి, అంకుగారి శ్రీధర్రెడ్డి, గదరాజు చందు,స్వాములపల్లి కనుకచారి, బత్తిని నర్సింహులు, గోనే హరి పాల్గొన్నారు.
చేర్యాల, జనవరి 5 : కొమురవెల్లి మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మల్లన్న ఆలయ పునరుద్ధరణ కమిటీని నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 20 మంది సభ్యులతో కూడిన జంబో కమిటీని ప్రభుత్వం నియమించింది.పునరుద్ధరణ కమిటీ నాలుగు మాసాల పాటు కొనసాగనుంది. కమిటీలో పర్పాటకం లక్ష్మారెడ్డి, కొమ్ము రాజేశ్వరి, అంబాల ఉమారాణి, అల్లం శ్రీనివాస్, పయ్యావుల ప్రవీణ్యాదవ్, బోయిని సాయియాదవ్, లింగంపల్లి శ్రీనివాస్, ముస్త్యాల దామోదర్, ఎర్రబచ్చలి శ్రీనివాస్, మద్దికుంట శ్రీనివాస్, చిరుమల్ల నర్సింహులు, చీపురు భిక్షపతి, కాయితా మోహన్రెడ్డి, గడ్డం వీరభద్రప్ప, పి. శ్రీనివాస్, తాళ్లపల్లి రమేశ్, కామిడి రమణారెడ్డి, సి.కిరణ్కుమార్, బండారు మధుసూదన్, కె.అంజయ్యయాదవ్కు చోటు కల్పించారు.