జహీరాబాద్, ఫిబ్రవరి 7 :దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన కేతకీ సంగమేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి అధికారులు భారీగా ఏర్పా ట్లు చేయాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ తెలిపారు. మం గళవారం ఝరాసంగంలో ఉన్న కేతకీ సంగమేశ్వర ఆలయం లో మహాశివరాత్రి ఉత్సవాలపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి, పలు సూచనలు చేశారు. మహాశివరాత్రి ఈ నెల 18న ఉందని, 16వ తేదీలోగా ఉత్సవాల ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
నియోజకవర్గ ప్రత్యేక అధికారి, జడ్పీ సీఈవో ఏల్లయ్య, డీపీవో సురేశ్మోహన్, జహీరాబాద్ ఆర్డీవో రమేశ్బాబు, డీఎస్పీ రఘు పర్యవేక్షణలో ఉత్సవాలు ఏర్పాట్లు చేయాలన్నారు. కర్ణాటక, మహారాష్ర్ట, తెలంగాణ రాష్ర్టాలకు చెందిన భక్తులు భారీగా మహాశివరాత్రికి వస్తారని, భక్తులకు సౌకర్యాలు కల్పించాలన్నారు. స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు క్యూలైన్లు ఏర్పాటు చేసి, తాగునీరు, ఇతర సౌకర్యాలు అందేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. జాతర కోసం వాటర్ ట్యాంకులు సిద్ధం చేసుకోవాలన్నారు. మరుగుదొడ్లు, మూత్రశాలలు తాత్కాలికంగా ఏర్పాటు చేయాలన్నా రు.
వాహనాలు నిలిపేందుకు పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. అమృత గుం డంలో ప్రతిరోజూ నీటిని ఖాళీ చేసి, స్వచ్ఛమైన నీరు నింపాలని ఆదేశించారు. అమృత గుండం వద్ద ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు తీ సుకోవాలన్నారు. బీదర్ నుం చి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడిపించాలని జహీరాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ను ఆదేశించా రు. మహాశివరాత్రి రోజు సరి పడా ఆర్టీసీ బస్సులు నడిపించాలన్నారు. సమాచార శాఖ ప్రభుత్వ పథకాలపై ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని ఆదేశిం చారు. ఉత్సవాలకు సంబంధించిన పనులన్నీ 16వ తేదీలోగా పూర్తి చేయాలన్నారు.
ఆర్డీవో రమేశ్బాబు, డీఎస్పీ రఘు జాతర ఏర్పాట్లను పర్యవేక్షించాలని సూచించారు. ఉత్సవాలకు నిధులు మంజూరు చేయాలని డీసీఎంఎస్ చైర్మ్న్ శివకుమార్ కోరారు. ఎమ్మెల్యే మాణిక్రావుతో కలిసి మంత్రి హరీశ్రావును కలిసి నిధులు మంజూరు చేయాలని కోరుతా మని తెలిపారు. శివస్వాముల దర్శనం కోసం ప్రత్యేక ఏర్పా ట్లు చేయాలన్నారు. ఉత్సవాలు ముగిసే వరకు ప్రతిరోజూ సంస్కృతిక కార్యక్రమలు నిర్వహించాలని ఆదేశించారు.
సిద్ధివినాయక, రుక్మాపూర్ రోడ్లుకు మరమ్మతులు
జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు
మహాశివరాత్రికి కర్ణాటక, మహారాష్ర్ట నుంచి భక్తులు సంగమేశ్వరస్వామి దర్శనానికి వస్తారని, న్యాల్కల్ మండలంలోని సిద్ధివినాయక, రుక్మాపూర్ గ్రామం నుంచి ఉన్న రోడ్లుకు మరమ్మతులు చేయాలన్నారు. ఆర్అండ్బీ, పీఆర్ అధికారులు గడువులోగా రోడ్లుకు మరమ్మతులు చేయాలని సూచించారు. ఉత్సవాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. కరెంట్ సరఫరాలో ఇబ్బందులు లేకుండా ట్రాన్స్కో అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మాణిక్రావు కోరారు. సమీక్ష అనంతరం కలెక్టర్, ఎమ్మెల్యే, డీసీఎంఎస్ ఉమ్మడి జిల్లా చైర్మన్ శివకుమార్, సీడీసీ చైర్మన్ ఉమాకాంత్పాటిల్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సమావేశంలో జడ్పీ సీఈవో, డీపీవో, ఆర్డీవో, డీఎస్పీ, డీఎల్వీవో రాఘవరావు, ఐసీడీఎస్ అధికారి పద్మావతి, డీపీఆర్వో విజయలక్ష్మి, ఎం పీపీ దేవీదాస్, ఆలయ చైర్మన్ వెంకటేశం, సర్పంచ్ జగదీశ్, ఎంపీటీసీ రజినిప్రియ, బీఆర్ఎస్ నాయకుడు సంగమేశ్వర్, ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.