నర్సాపూర్, అక్టోబర్ 6: సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన కులవృత్తులకు లక్ష ఆర్థిక సాయం వారి తలరాతలను మారుస్తుందని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నర్సాపూర్ పట్టణంలోని సాయికృష్ణ గార్డెన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, కలెక్టర్ రాజర్షి షా, రాష్ట్ర లేబర్ వెల్ఫేర్ బోర్డ్ చైర్మన్ దేవేందర్రెడ్డి, అదనపు కలెక్టర్ రమేశ్తో కలిసి ఎమ్మెల్యే నియోజకవర్గ పరిధిలోని 468 లబ్ధిదారులకు బీసీబంధు చెక్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం అన్నివిధాలుగా అభివృద్ధి చెందాలనేదే సీఎం కేసీఆర్ ఆలోచనని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు తర్వాత ఎలాంటి అభివృద్ధి జరిగిందో ప్రజలు బేరీజు వేసుకోవాలని సూచించారు. కులవృత్తులను గౌరవించుకునేలా వారికి రూ. లక్ష చొప్పున అందజేసి సీఎం కేసీఆర్ వారి ఉపాధికి బాసటగా నిలిచాడని వెల్లడించారు. బీసీబంధు రానివారు అసంతృప్తి చెందవద్దని, విడతల వారీగా ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు.
– రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి
రాష్ట్రంలోని కులవృత్తులను ఆర్థికంగా ఆదుకోడానికి సీఎం కేసీఆర్ బీసీబంధు పథకాన్ని తీసుకువచ్చారని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి వెల్లడించారు. 14 కులాలకు నేడు బీసీబంధు చెక్కులు అందజేసి వారి ఆర్థిక స్థోమతని అధిగమించేలా చేశాడన్నారు. కులవృత్తులను గౌరవించింది కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వమేనని గతంలో ఏ ప్రభుత్వం వారిని ఆదుకోలేదని గుర్తుచేశారు. అలాగే, 25 వేల ప్రభుత్వ పాఠశాలలో 2.70 లక్షల మంది విద్యార్థులకు అల్పాహారం అందించే ఉద్దేశంతో ముఖ్యమంత్రి బ్రేక్ఫాస్ట్ పథకానికి శ్రీకారం చుట్టారని వెల్లడించారు.
అనంతరం కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన బీసీబంధు పథకం అద్భుతమైనదన్నారు. ఈ అవకాశాన్ని కులవృత్తులు సద్వినియోగపరుచుకొని ఆర్థికంగా ఎదగాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, జడ్పీ కో-ఆప్షన్ మెంబర్ మన్సూర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పైడి శ్రీధర్గుప్తా, శివంపేట్ జడ్పీటీసీ పబ్బ మహేశ్, ఆత్మకమిటీ చైర్మన్లు వెంకట్రెడ్డి, ప్రతాప్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ నయీమొద్దీన్, పీఏసీఎస్ చైర్మన్లు రాజుయాదవ్, వెంకట్రాంరెడ్డి, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు భిక్షపతి, మున్సిపల్ కమిషనర్ వెంకట్గోపాల్, వివిధ మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, పార్టీ మండలాధ్యక్షులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.