అందోల్, ఏప్రిల్ 16: తాడ్దన్పల్లి చౌరస్తాలో మంగళ వారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ గ్రాండ్ సక్సెస్ కావడంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ను ప్రత్యేకంగా అభినందించారు. సభ ముగిసిన తర్వాత తిరుగుప్రయాణంలో క్రాంతికిరణ్కు ఫోన్ చేసిన కేసీఆర్ సభ గ్రాండ్ సక్సెస్ చేశావు క్రాంతి… గుడ్ గోయింగ్ .. ఇలాగే పనిచేయండి.. ప్రజల్లో కాంగ్రెస్ పట్ల చాలా వ్యతిరేకత ఉంది. మనం నిరంతరం ప్రజల్లో ఉంటూ కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడితే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. మీ సూచనలు తప్పకుండా పాటిస్తూ నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై కాంగ్రెస్ను, ప్రభుత్వాన్ని నిలదీస్తామని క్రాంతి చెప్పారు.
పుల్కల్, ఏప్రిల్ 16: సుల్తాన్పూర్ ప్రజా ఆశీర్వాద సభలో ఎమ్మెల్సీ, రచయిత దేశపతి శ్రీనివాస్ పాడిన గోవిందా..గోవిందా సాంగ్ అందరినీ అలరించింది.బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన పథకాలు..కాంగ్రెస్ ప్రభుత్వంలో అమలు చేయకపోవడంతో సాంగ్ రూపంలో ప్రజలకు అర్థయమయ్యేలా ఆయన పాట పడి ఆకట్టుకున్నారు.