‘సర్వేంద్రియానం నయనం ప్రధానం.. అంధత్వంతో ఇబ్బందిపడుతున్న వారికి చూపును ప్రసాదించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కంటివెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.’ అని వైద్య, ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి రెండో విడత ప్రారంభమవుతున్న నేపథ్యంలో కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు,అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంటి వెలుగుపై ప్రజలకు అవగాహన కల్పించేలా విస్తృత ప్రచారం చేయాలన్నారు. ఈ నెల 12లోగా జిల్లా స్థాయిలో మంత్రి ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం నిర్వహించి కార్యక్రమం విజయవంతం చేయాలని సూచించారు.
సంగారెడ్డి కలెక్టరేట్/మెదక్, జనవరి 3 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభు త్వం ఈ నెల 18 నుంచి రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నదని మంత్రి హరీశ్రావు అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, పంచాయతీ రాజ్, మున్సిపల్ అధికారులు, వైద్యాధికారులతో ఏర్పా టు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
కంటి చూపుతో బాధపడుచున్న వారికి ఈ నెల 18 నుంచి వైద్య పరీక్షలు చేయుటకు గతంలో 827 బృందాలు ఏర్పాటు చేయగా, నేడు 1500 బృందాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. బృందాల షెడ్యూల్ ప్రకారం గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో ఏర్పాటు చేసిన శిబిరాల్లో సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి వెంటనే రీడింగ్ అద్దాలు అందజేస్తామన్నారు.
తెలంగాణలోనే నాణ్యమైన కండ్ల జోళ్లను తయారు చేసి 30 లక్షల రీడింగ్ అద్దాలు, 20 లక్షల ప్రిస్రిప్షన్ అద్దాలు అందజేయుటకు అన్ని చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. శిబిరంలో ప్రజలకు ఇబ్బంది కలుగకుండా తాగునీరు, ఫర్నిచర్ ఏర్పాటు చేయాలని ఇందుకు ప్రతి రోజు రూ. వెయ్యి, బృందం సభ్యులకు రోజు రూ. 1500 చొప్పున డీఏ అందజేయడంతో పాటు వాహనాలు సమకూరుస్తున్నామని తెలిపారు. గ్రామాల్లో ఏ రోజు శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారో సర్పంచ్లు, ఎంపీటీసీలు, మెప్మా, స్వయం సహాయక బృందాలు ప్రజలకు అవగాహన కలిగించాలని సూచించారు.
ఈ నెల 12లోగా మండల పరిషత్ కార్యాలయంలో, మున్సిపాలిటీల స్థాయి లో ప్రజాప్రతిధులు, జిల్లా స్థాయిలో స్థానిక మంత్రితో కలిసి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసుకొని పకడ్బందీగా కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. కార్యక్రమాల పర్యవేక్షణకు రాష్ట్రస్థాయిలో 10 క్వాలిటీ కంట్రోల్ బృందాలు, జిల్లాలో ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. మేడ్చల్ జిల్లా నుంచి మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుబాశ్ రెడ్డితో కలిసి పాల్గొన్న కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ.. రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవం తం చేసేందుకు 40 బృందాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రికి వివరించారు.
ఇందులో 35 గ్రామీణ ప్రాంతాల్లో కాగా , 5 పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయడంతో పాటు మరో 5 బృందాలను బఫర్లో అదనంగా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కాగా ఒకో బృందం లో ఒక ఆప్టోమెట్రిస్ట్, ఒక వైద్యాధికారి, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్, ఇద్దరు ఏఎన్ఎంలు, ఇద్దరు సూపర్ వైజర్లు, ముగ్గురు ఆశవరర్లు ఉంటారని తెలిపారు. జిల్లా జనా భా 8,85,519 మందిగా అంచనా వేశామని అందులో గ్రామీణ ప్రాంత జనాభా 7,39,444 కాగా, పట్టణ జనా భా 1,20,075 అని అందులో 55 శాతం 4,72, 802 మందికి కంటి పరీక్షలు నిర్వహించుటకు 469 గ్రామ పంచాయతీలు, నాలుగు మున్సిపాలిటీ వార్డుల్లో ఈ నెల 18 నుంచి వంద పనిదినాలు శిబిరాలు ఏర్పాటు చేయుటకు షెడ్యూల్ రూపొందించామన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్లో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, జగదీశ్వర్ రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్, శ్వేతా మహంతి, వైద్య సంచాలకులు శ్రీనివాస్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, ఇఫో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, జిల్లా పరిషత్ వైస్చైర్ పర్సన్ లావణ్య రెడ్డి, జిల్లా వైద్యాధికారి చందు నాయక్, జిల్లా పరిషత్ సీఈవో శైలేశ్, డీఆర్డీవో శ్రీనివాస్, డీపీవో రాజేంద్రప్రసాద్, మున్సిపల్ కమిషనర్ జానకీరామ్ సాగర్, జిల్లా పరిశ్రమల అధికారి కృష్ణ మూర్తి, వైద్యాధికారులు పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లాలో 17,11,685 మందికి స్క్రీనింగ్
ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లాలో 17,11, 685 మందికి స్క్రీనింగ్ చేయనున్నట్లు కలెక్టర్ శరత్ తెలిపారు. ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తల ఇంటింటికీ తిరిగి గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల్లో కంటి వెలుగు శిబిరాల ప్రాంతాలు, తేదీలు, సమయం గురించిన వివరాలు ముందస్తుగా తెలియజేయనున్నట్లు వివరించారు. జిల్లాలో 69 బృందాలను ఏర్పాటు చేశామని, ఆయా బృందాలు అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, జిల్లాలోని జీహెచ్ఎంసీ ఏరియాను కవర్ చేస్తాయని వీడియో కాన్ఫరెన్స్లో మంత్రికి వివరించారు.
జిల్లాలోని 647 గ్రామ పంచాయతీలు, 8 మున్సిపాలిటీల్లోని 199 వార్డులు, జీహెచ్ఎంసీ పరిధిలో 3 వార్డులకు 854 క్యాంప్లను ఏర్పాటు చేసేందుకు వేదికలను గుర్తించామన్నారు. 69 మంది పారామెడికల్ ఆప్తాలమిక్ ఆఫీసర్లు, 69 డేటా ఎంట్రీ ఆపరేటర్లను 6 నెలల కాల పరిమితితో అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఏర్పాటు చేశామన్నారు. ఈ వీడియోకాన్ఫరెన్స్లో జిల్లా నుంచి అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి, ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, మున్సిపల్ చైర్మన్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.