సర్వేంద్రియానాం నయనం ప్రధానం.. అవును మరీ కండ్లు లేకపోతే ఏమీ చూడలేం.. కండ్ల ప్రాధాన్యత గుర్తించిన తెలంగాణ సర్కారు 2018 ఆగస్టు 15న ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రజల కంటి సమస్యలను పరిష్కరించేందుకు రికార్డు స్థాయిలో పరీక్షలు, శస్త్రచికిత్సలు చేయించింది. కండ్లద్దాలు పంపిణీ చేసింది. తొలి విడత కార్యక్రమానికి విషేశ స్పందన వచ్చింది. ఎంతో మంది పేదలకు ‘కంటి వెలుగు’ భరోసానిచ్చింది. పేద ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్నది. అంధత్వరహిత తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ రెండో విడత కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. జనవరి 18 నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు ఆదేశాల మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు ఉమ్మడి జిల్లాలోని సిద్దిపేటలో 45, మెదక్లో 40, సంగారెడ్డిలో 69 బృందాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
సిద్దిపేట, డిసెంబర్ 1(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నివారించదగిన అంధత్వ రహిత తెలంగాణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ‘కంటివెలుగు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 2018 ఆగస్టు 15న మెదక్ జిల్లాలో సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. తొలి విడత కార్యక్రమం విజయవంతం కాగా, జనవరి 18నుంచి రెండో విడతను ప్రారంభించనున్నారు. రెండో విడత కంటివెలుగు కార్యక్ర మాన్ని చేపట్టడానికి ఉమ్మడి జిల్లాలో 154 బృందాలను ఏర్పాటు చేయాలని వైద్యశాఖ ప్రతిపాదించింది. సిద్దిపేటలో 45, మెదక్లో 40, సంగారెడ్డిలో 69 బృందాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అంధత్వ రహిత జిల్లాలుగా చేయడమే ధ్యేయంగా రెండో విడత చేపడుతున్న కంటివెలుగు కార్యక్రమానికి గ్రామాల్లో విస్తృత ప్రచారం చేపట్టనున్నారు. అన్ని గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించి, వారికి శస్త్ర చికిత్స చేసి, అద్దాలు అందజేస్తారనే విషయాలను గ్రామాల్లో వివరిస్తారు. మండల, గ్రామ స్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తారు.
ఆర్థికపరంగా ఇబ్బంది పడుతున్న వారికి, కంటి చూపు తక్కువగా ఉన్న వారందరికి ‘కంటి వెలుగు’ నింపుతామని సీఎం కేసీఆర్ తొలి విడత ‘కంటి వెలగు’ కార్యక్రమాన్ని నాలుగేండ్ల కిందట ప్రారంభించారు. దీనికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. మళ్లీ రెండో విడత కంటి వెలుగు కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం జనవరి 18 నుంచి శ్రీకారం చుడుతున్నది. తొలి విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని మెదక్ జిల్లా తూప్రాన్ మండలం మల్కాపూర్లో సీఎం కేసీఆర్ 2018 ఆగస్టు 15న శ్రీకారం చుట్టారు. ఇక్కడి నుంచి రాష్ట్రవ్యాప్తంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించి, కంటి చూపుతో బాధపడుతున్న వారికి అవసరమైన పరీక్షలు నిర్వహించి వారికి కంటి అద్దాలు, చికిత్సల కోసం సిఫార్సు చేసి వారికి కంటి పరీక్షలను చేయించారు.
కంటి వెలుగులో పరీక్షలు చేయించుకొని, అద్దాలు తీసుకున్న తర్వాత సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్న మహిళలు(ఫైల్)
తొలి విడత కంటి వెలుగు కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా మంచి స్పందన వచ్చింది. ఎంతో మంది పేదలకు ఈ పథకం భరోసానిచ్చింది. పేద ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్నది. రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు ఆదేశాల మేరకు జిల్లాల్లో అధికార యంత్రాంగం ఇందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నది. రెండో విడత కంటి వెలుగు కార్యక్రామన్ని చేపట్టడానికి ఉమ్మడి జిల్లాలో 154 బృందాలను ఏర్పాటు చేయాలని వైద్యశాఖ ప్రతిపాదించింది. సిద్దిపేటలో 45, మెదక్లో 40, సంగారెడ్డిలో 69 బృందాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అంధత్వ రహిత జిల్లాలుగా చేయడమే ధ్యేయంగా రెండో విడత చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమానికి గ్రామాల్లో విస్తృత ప్రచారం చేపట్టనున్నారు. అన్ని గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించి, వారికి అంధత్వ, శస్త్ర చికిత్స చేసి, అద్దాలు అందజేస్తారనే విషయాలను గ్రామాల్లో వివరిస్తారు. మండల, గ్రామ స్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తారు. గ్రామాల్లోని వారందరికీ కంటి పరీక్షలు నిర్వహించేలా పక్కా ప్రణాళికను రూపొందించనున్నారు. ఇందు కోసం గ్రామాల్లో టాంటాం, ప్రత్యేకంగా రూపొందించిన వాల్పోస్టర్లు, కరపత్రాల పంపిణీ తదితర వాటితో విస్తృత ప్రచారం నిర్వహించనున్నట్లు సమాచారం.
రెండో విడత కంటి వెలుగుకు పక్కా ప్రణాళిక
కంటి వెలుగు రెండో విడత కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం జనవరి 18వ తేది నుంచి శ్రీకారం చుడుతున్నది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు, బృందాలు, కావాల్సిన సిబ్బంది తదితర అంశాలపై మంత్రి హరీశ్రావు ప్రత్యేక దృష్టి సారించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఇటీవలనే వైద్యాధికారులతో మంత్రి హరీశ్రావు సమీక్షా నిర్వహించి, దిశానిర్దేశం చేశారు. మొదటి విడతలో చేపట్టిప కంటి వెలుగు స్ఫూర్తితోనూ, అప్పుడు జరిగిన లోటు పాట్లను సవరించుకుంటూ ముందుకెళ్లేలా పక్కా ప్రణాళికతో జిల్లా వైద్యాధికారులు సిద్ధమవుతున్నారు. తొలి విడత కంటి వెలుగు కార్యక్రామన్ని మెదక్ జిల్లా తూప్రాన్ మండలం మల్కాపూర్ వేదికగా సీఎం కేసీఆర్ 2018 ఆగస్టు 15న ప్రారంభించారు. అప్పటి నుంచి 2019 మార్చి వరకు కొనసాగింది. ఈ సమయంలో (తొలి విడత కంటి వెలుగు కార్యక్రమంలో) సిద్దిపేట జిల్లాలో 4,53,980 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు.
59,079మందికి కంటి అద్దాల పంపణీ చేశారు. 30,851 మందిని చికిత్సలకు సిఫార్సు చేశారు. మెదక్ జిల్లాలో 4,39,316 మందికి కంటి పరీక్షలు చేసి, 61,695 మందికి కంటి అద్దాలు అందించారు. 13,246 మందికి చికిత్సల కోసం సిఫార్సు చేశారు. ఇక సంగారెడ్డి జిల్లాలో 10,16,877 మందికి కంటి పరీక్షలు చేసి 1,18,526 కంటి అద్దాలు పంపిణీ చేశారు. 48,120 మందిని చికిత్సల కోసం సిఫార్సు చేశారు. రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టడానికి గానూ ఉమ్మడి మెదక్ జిల్లాలో 154 టీంలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సిద్దిపేట జిల్లాలో 45 టీంలు, మెదక్ జిల్లాలో 40 టీంలు, సంగారెడ్డి జిల్లాలో 69 టీంలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఒక్కో బృందంలో ఒక వైద్యాధికారి, ఒక అప్తోమెట్రిస్ట్, ఇద్దరు లేదా ముగ్గురు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, ఇద్దరు ఏఎన్ఎంలు, ఇద్దరు డాటా ఎంట్రీ ఆపరేటర్లు, ముగ్గురు ఆశ వర్కర్లు ఉండనున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. కంటి వెలుగు శిబిరానికి వచ్చిన ప్రతి ఒక్కరి వివరాలను నమోదు చేస్తారు. శిబిరానికి వచ్చే వారు ఆధార్ కార్డు లేదా స్థానిక ధ్రువపత్రం తీసుకురావాల్సి ఉంటుంది. కాగా, రెండు రోజులు కిందట అవసరమైన సిబ్బంది నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.