బీఆర్ఎస్ ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు సిద్ధమైంది. సీఎం కేసీఆర్కు సెంటిమెంట్గా భావించే హుస్నాబాద్లో ఎన్నికల తొలి ప్రజా ఆశీర్వాద సభ ఆదివారం నిర్వహిస్తున్నారు. 2014, 2018 ఎన్నికల్లో ప్రజాఆశీర్వాద సభ ఇక్కడే నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ రెండుసార్లు భారీ విజయాన్ని సాధించారు.
శనివారం హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్కుమార్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, రాజ్యసభ మాజీ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. నియోజకవర్గంలోని ఏడు మండలాల నుంచి లక్షకు పైగా జనాన్ని సభకు తరలించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. అధినేత సభను విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పటికే సన్నాహక సమావేశాలు నిర్వహించి భారీగా జన సమీకరణ చేసేందుకు దిశానిర్దేశం చేశాయి. మరోవైపు గులాబీ అభ్యర్థులు ప్రచారంలో
ఉద్యమాల పురిటిగడ్డ హుస్నాబాద్ ఆది నుంచి తెలంగాణ ఉద్యమంలో ముందున్నది. ఈ ప్రాంతమంటే ముఖ్యమంత్రి కేసీఆర్కు అమితమైన ప్రేమ.తనకు అచ్చొచ్చిన, సెంటిమెంట్గా భావించే హుస్నాబాద్ నుంచే 2014, 2018 ఎన్నికల శంఖారావాన్ని సీఎం కేసీఆర్ మొదలుపెట్టారు. ఈసారి జరిగే శాసనసభ ఎన్నికల్లోనూ హుస్నాబాద్ గడ్డ నుంచే ప్రజా ఆశీర్వాద సభ ద్వారా ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తున్నారు. మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్లో ఒకనాడు తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఉండేవి. స్వరాష్ట్రంలో ఈ ప్రాంత రూపురేఖలు మారిపోయాయి. గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణం పూర్తి కావడంతో రైతులకు వరప్రదాయినిగా మారింది. వేల కోట్ల రూపాయలతో ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగడంతో మౌలిక వసతులు ఒనగూరాయి.
హుస్నాబాద్, అక్టోబర్ 14: తెలంగాణ ఉద్యమ సమయం నుంచి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుకు హుస్నాబాద్తో వీడదీయరాని అనుంబంధం ఉంది.
ఈ నియోజకవర్గంలోని సబ్బండ వర్గాలు ఉద్యమంలో కలిసి రావడం, ఉద్యమ స్ఫూర్తిని నింపుకొని గత ఎన్నికల్లో భారీ మెజార్టీ ఇవ్వడమనే చెప్పొచ్చు. అందుకే 2014, 2018 ఎన్నికల శంఖారావాన్ని సీఎం కేసీఆర్ హుస్నాబాద్ నుంచే మొదలుపెట్టారు. ఇదే స్ఫూర్తితో మళ్లీ ఈ సారి ఎన్నికలకు ఇక్కడినుంచే శ్రీకారం చుట్టాలని ప్రజా ఆశీర్వాద సభను నిర్వహించబోతున్నారు. దీంతో రాష్ట్ర రాజకీయాలకు హుస్నాబాద్ కేంద్ర బిందువైంది. తనకు అచ్చొస్తున్న హుస్నాబాద్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో కేవలం 1.24 టీఎంసీల సామర్థ్యం ఉన్న గౌరవెల్లి రిజర్వాయర్ను 8.23 టీఎంసీలకు పెంచారు.
అందుకు తగిన నిధులను వెంటనే మంజూరు చేసి పూర్తి చేయించిన ఘనత ఆయనదే. హుస్నాబాద్ పట్టణాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయాలని కోట్లాది రూపాయల నిధులను కేటాయించారు. మహాసముద్రం గండిని స్వయంగా సందర్శించి నిధుల కేటాయించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించారు. హరితహారంలో ముందుండాలనే లక్ష్యంతో హుస్నాబాద్లో స్వయంగా మొక్కలునాటి ఇక్కడి ప్రజలకు కేసీఆర్ స్ఫూర్తినిచ్చారు. మరోసా ఇక్కడే ఎన్నికల శంఖారావం పూరించి ఎన్నికల్లో ఘన విజయం సాధించాలనే లక్ష్యంతో ముందుకు పోతున్న సీఎం కేసీఆర్ రాబోయే రోజుల్లో హుస్నాబాద్ను బంగారు నియోజకవర్గంగా తీర్చిదిద్దుతారనే నమ్మకంతో ప్రజలు ఉన్నారు.
హుస్నాబాద్ ప్రాంత వరప్రదాయినిలు అయిన గౌరవెల్లి, గండిపల్లి రిజర్వాయర్లను ఏప్రిల్ 13, 2015న సీఎం కేసీఆర్ స్వయంగా సందర్శించారు. రెండు రిజర్వాయర్ల సామర్థ్యాన్ని అధికారుల ద్వారా తెలుసుకున్న కేసీఆర్ చిన్న చెరువులను తలపించే రిజర్వాయర్లతో ఈ ప్రాంత రైతులకు ఒరిగేదేమీ లేదని, రిజర్వాయర్ల సామర్థ్యం పెంచుతున్నామని ప్రకటించారు. అదనంగా భూములు కోల్పోయే నిర్వాసితులకు కొండంత అండగా ఉండి ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
ఇందులో భాగంగానే గౌరవెల్లి రిజర్వాయర్ సామర్థ్యం 1.24 టీఎంసీల నుంచి 8.23 టీఎంసీలకు పెంచారు. నిర్వాసితులకు ఇచ్చే పరిహారాన్ని పెంచారు. గండిపల్లి రిజర్వాయర్ 0.25 టీఎంసీల నుంచి 1.25 టీఎంసీలకు పెంచారు. వీటికి రూ.2వేల కోట్ల నిధులను మంజూరు చేశారు. ప్రస్తుతం రెండు రిజర్వాయర్లు పనులు పూర్తయ్యాయి. ఇదేరోజున మహాసముద్రం గండిని స్వయంగా సందర్శించి అక్కడే నాయకులు, ప్రజల మధ్య సహపంక్తి భోజనాలు చేసి దీని పునరుద్ధరణకు రూ.8కోట్ల నిధులు కేటాయించారు. గండి నిర్మాణం పూర్తి కావడంతో సుమారు 20గ్రామాల్లోని వ్యవసాయ బావుల్లో భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్ కలలుగన్న ఆకుపచ్చ తెలంగాణలో భాగంగా నిర్వహించ తలపెట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని హుస్నాబాద్లోనే ప్రారంభించారు. జూలై 4, 2015 రోజున హుస్నాబాద్లోని రేణుకా ఎల్లమ్మ దేవాలయం ఆవరణలో తొలిమొక్కను నాటి హరితహారం కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. ముఖ్యమంత్రి స్వయంగా మొక్కలు నాటి స్ఫూర్తినివ్వడంతో హుస్నాబాద్ నియోజకవర్గంలో వేలాది మొక్కలు నాటారు. వాటిని కాపాడడంతో ఏపుగా పెరిగి పచ్చదనాన్ని పంచుతున్నాయి. ఈ సందర్భంగా
జరిగిన బహిరంగ సభలో హుస్నాబాద్ పట్టణ అభివృద్ధికి రూ.కోటి నిధులు, నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు గ్రామానికో రూ.10లక్షల రూపాయల అభివృద్ధి నిధులు మంజూరు చేశారు. అప్పటి నుంచే హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధ్దికి నాంది పలికినట్లయ్యింది.
గత అసెంబ్లీ ఎన్నికల శంఖారావాన్ని కేసీఆర్ హుస్నాబాద్ నుంచే ప్రారంభించారు. ఏప్రిల్ 17, 2014న హుస్నాబాద్లో జరిగిన బహిరంగ సభ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అంతకు నాలుగు రోజుల ముందు ఏప్రిల్ 13, 2014న కరీంనగర్లో సభ జరిగినప్పటికీ అసలైన ఎన్నికల ప్రచారం హుస్నాబాద్ నుంచే ప్రారంభమైంది. 2018, సెప్టెంబర్ 7న రెండో ప్రజా ఆశీర్వాద సభ జరిగింది. ఈ రెండు సభలు పట్టణంలోని డిపో గ్రౌండ్లో జరగగా భారీగా జనం తరలివచ్చారు.
రెండు సభల అనంతరం ఎన్నికల ప్రచారం ఉధృతంగా కొనసాగడం, ఆయా ఎన్నికల ఫలితాల్లో భారీ విజయం నమోదు కావడంతో ఈసారి కూడా ఇక్కడి నుంచే ప్రచారం మొదలు పెట్టేందుకు సీఎం కేసీఆర్ సిద్ధమయ్యారు. 14 ఏండ్ల ఉద్యమాన్ని కొనసాగించి రాష్ర్టాన్ని సాధించడంతో పాటు తొమ్మిదిన్నరేండ్ల విజయవంతమైన పాలన అందించిన సీఎం కేసీఆర్ హుస్నాబాద్లో ఈనెల 15న జరిగే ప్రజాఆశీర్వాద సభ విజయవంతమై హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా తెలంగాణ చరిత్రలో నిలుస్తారని, తెలంగాణను అన్నిరంగాల్లో దేశంలో నంబర్వన్గా నిలబెడతారని ఆశిద్దాం.