కులవివక్షకు వ్యతిరేకంగా పోరాడిన మహాయోధుడు
గొప్ప సంఘ సంస్కర్త, బడుగు వర్గాల ఆశాజ్యోతి
ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలి
మెదక్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు హరీశ్, హనుమంతరావు
రెండు జిల్లాల్లో ఘనంగా పూలే జయంతి
విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి
దేశానికి చేసిన సేవలను కొనియాడిన ప్రముఖులు
అట్టడుగు వర్గాల అభ్యున్నతికి, స్త్రీ విద్య, లింగసమానత్వం కోసం కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడు జ్యోతిబాఫూలే అని, ఆయనను స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకెళ్లాలని మెదక్ కలెక్టర్ హరీశ్, సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు అన్నారు. సోమవారం ఫూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రెండు జిల్లాల్లో వివిధ పార్టీలు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో అసమానతలను రూపుమాపేందుకు, మహిళల విద్య కోసం పోరాడిన మహనీయుడు ఫూలే అన్నారు. బహుజనులకు రాజ్యాధికారం దక్కితేనే సమసమాజ స్థాపన సాధ్యమవుతుందని ఆనాడే గ్రహించి, వారి కోసం పాటు పడిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఆయన ఆశయాల సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
మెదక్/సంగారెడ్డి అర్బన్, ఏప్రిల్ 11 : మహాత్మా జ్యోతిబాఫూలే గొప్ప సంఘ సంస్కర్తని, పేదల కోసం జీవితాంతం శ్రమించిన త్యాగశీలని సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు అన్నారు. ప్రతి ఒక్కరూ మహనీయుల అడుగుజాడల్లో నడిచి వారి ఆశయస్ఫూర్తిని కొనసాగించాలని కలెక్టర్ పిలుపు నిచ్చారు. మహాత్మా జ్యోతిబాఫూలే జయంతి పురస్కరించుకొని సోమవారం సంగారెడ్డిలోని ఆయన విగ్రహానికి కలెక్టర్ హనుమంతరావు, ఎస్పీ రమణ కుమార్, అదనపు కలెక్టర్ రాజర్షిషా, మున్సిపల్ చైర్పర్సన్ బొంగుల విజయలక్ష్మి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ అట్టడుగు వర్గాల అభ్యున్నతికి, సమాజంలోని దురాచారాలు, అసమానతల నిర్మూలనకు కృషి చేసిన మహనీయుడు జ్యోతిబాపూలే అని కొనియాడారు. ఎస్పీ రమణకుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కులరహిత సమాజం వైపు నడవాలని, వివక్షతకు చమరగీతం పాడాలని పిలుపు నిచ్చారు.
అదనపు కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ సమాజంలో అన్ని కులాలు సమానత్వంగా కొనసాగాలంటే విద్య ఒక్కటే మార్గమన్నారు. అనంతరం జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, వైస్ చైర్మన్ లతా విజయేందర్రెడ్డి, వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. గెజిటెడ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వైద్యనాథ్ మాట్లాడుతూ జిల్లాకు చెందిన పేద విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్ కావాలనుకునే ఐదు మందిని దత్తత తీసుకొని వారికి తన వేతనం నుంచి పది శాతం ఖర్చు చేసి ప్రోత్సహిస్తానని ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు కలెక్టర్ సర్టిఫికెట్లు, మెమొంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సం క్షేమ శాఖ అధికారి జగదీశ్, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఎ స్పీ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి..
బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పాటు పడిన జ్యోతిబాపూలే అందరికీ ఆదర్శప్రాయుడని, ఆయన అడుగుజాడల్లో నడువాలని మెదక్ కలెక్టర్ హరీశ్ యువతకు పిలుపునిచ్చారు. పూలే జయంతి సందర్భంగా జిల్లా వెనుక బడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని ఆడిటోరియంలో కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన గావించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వ్యాసరచన పోటీల్లో పాల్గొన్న వివిధ వసతి గృహా విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థినీ, విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రమేశ్, బీసీ అభివృద్ధి అధికారి కేశురాం, డీఆర్డీవో శ్రీనివాస్, డీఈవో రమేశ్, డీపీవో తరు ణ్ కుమార్, డీఎస్డీవో విజయలక్ష్మి, జిల్లా పరిశ్రమల అధికారి కృష్ణమూర్తి, జిల్లా రవాణాధికారి శ్రీనివాస్గౌడ్, అదనపు బీసీ అధికారి నాగరాజుగౌడ్, వసతి గృహ సంక్షేమాధికారులు శ్రీనివాస్, నర్సింహులు, మనోహర్, సుధాకర్రెడ్డి, మహేందర్రెడ్డి, పుణ్య మ్మ, సుధాకర్, స్వామి, గీతాంజలి, సుజాత, గాయత్రి, జ్యోతిబాపూలే ఆశ్రమ పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.