నిజాంపేట, నవంబర్ 30 : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి పలు పార్టీల నేతలు టీఆర్ఎస్(బీఆర్ఎస్)లో చేరుతున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు.
నిజాంపేట మండలంలోని రాంపూర్గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు తిరుపతి గౌడ్, వెంకటస్వామి గౌడ్,శివలింగంగౌడ్ బుధవారం హైదరాబాద్లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి,ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్(బీఆర్ఎస్)లో చేరారు. అనంతరం నాయకులు లక్ష్మణ్,అంజగౌడ్ గ్రామంలో సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణానికి నిధులను మంజూరు చేయాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు.