కోహీర్, అక్టోబర్ 7: హోటల్ మేనేజ్మెంట్ కళాశాలల్లో శిక్షణ పొందిన యువతులకు ఉద్యోగవ అకాశాలను కల్పిస్తామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. శనివారం కోహీర్ మండలంలోని కవేలి జాతీయ రహదారి పక్కననున్న హోటల్ మేనేజ్మెంట్ కళాశాల ఆవరణలో మహాత్మా జ్యోతిబాపూలే హోటల్ మేనేజ్మెంట్ మహిళా డిగ్రీ గురుకుల కళాశాలను మంత్రి హరీశ్రావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీ కళాశాలల్లో శిక్షణ పొందిన ప్రతిఒక్కరికీ ఉపాధి కల్పిస్తామని భరోసానిచ్చారు. యువతులకు భవిష్యత్లో కళాశాల ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ సందర్భంగా కోహీర్ ఆర్టీసీ బస్టాండును వినియోగంలోని తీసుకురావాలని మంత్రికి వినతిపత్రం అందజేశారు. ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్రావు, బెవరేజస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్, కలెక్టర్ శరత్, ఆర్డీవో వెంకారెడ్డి, తహసీల్దార్ శాంతకుమారి, కళాశాల ప్రిన్సిపాల్ జయచంద్ర, విజయ్కుమార్రెడ్డి, పాల్గొన్నారు.