చౌటకూర్, అక్టోబర్ 9 : నాడు అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న ఆ పల్లె నేడు ప్రగతి పథంలో దూసుకుపోతున్నది. సంగారెడ్డి-నాందేడ్, అకోలా 161 జాతీయ రహదారికి అనుకుని ఉన్న సుల్తాన్పూర్ గ్రామం నేడు అందరికీ తలలో నాలుకలా మారింది. తెలంగాణ తొలి ప్రభుత్వంలోనే ప్రతిష్టాత్మకమైన జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ (జేఎన్టీయూ) సుల్తాన్పూర్ వద్దనే ఏర్పాటు కావడంతో అనునిత్యం రద్దీగా ప్రాంతంగా బాసిల్లుతున్నది. నాటి ప్రభుత్వాలు పల్లెలను పూర్తిగా విస్మరించడంతో అభివృద్ధికి నోచుకోలేకపోయాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం.. బీఆర్ఎస్ ప్రభుత్వ పగ్గాలు చేపట్టాక ప్రగతిని పరుగులు పెట్టించారు. సీఎం కేసీఆర్ ముందు చూపుతో గ్రామాల రూపురేఖలను పూర్తిగా మార్చివేయాలన్న కృతనిశ్చయంతో గ్రామాలకు ప్రత్యేక గ్రాంట్లు మంజూరు చేశారు. దీంతో పల్లెల్లో పూర్తిగా వెలుగులు నిండాయి. నాడు సరైన రోడ్లు, మురుగు కాల్వలు, సిమెంటు రోడ్లు వంటి సౌకర్యాలు లేక మట్టి రోడ్లతోనే దర్శనమివ్వడంతో ప్రజలు నానా అవస్థలు పడ్డారు. నిధులు పుష్కలంగా అందుబాటులోకి రావడంతో నేడు అనేక అభివృద్ధి పనులు చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ సహకారంతో సుల్తాన్పూర్ గ్రామంలో రూ.80 లక్షల నిధులతో ప్రగతి పనులు నిర్వహించారు. అన్నీ మౌలిక వసతులు సమకూరడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నీటి పారుదల రంగంలో అగ్రగామి
సుల్తాన్పూర్ గ్రామం నీటిపారుదల రంగంలో అగ్రగామిగా నిలిచిందని చెప్పవచ్చును. గ్రామ శివారులోని పెద్ద చెరువు పూడికతీతతో గణనీయంగా బీడు భూమి సాగులోకి వచ్చింది. సుమారు వంద ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందించేందుకు పెద్ద చెరువు ఎంతగానో దోహదపడుతున్నది. సింగూరు ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వగా అనుసంధానంగా ఉన్న మెయిన్ బ్రాంచి కెనాల్ ఈ చెరువు మీదుగానే ప్రవహిస్తుండటంతో ఆ కాల్వ నుంచి నీటిని చెరువులో మళ్లిస్తున్నారు. తద్వారా ఎల్లప్పుడూ నీటితోనే పెద్ద చెరువు కళకళలాడుతున్నది. వంద ఎకరాల ఆయకట్టు గల పెద్ద చెరువులో బ్యాక్ వాటర్ కూడా అంతే విస్తీర్ణంలో వ్యాపించి ఉండటం గమనార్హం. వానకాలం సీజన్తో పాటుగా యాసంగి సీజన్లో కూడా వరి పంటను పండిస్తూ రైతులకు సిరులోలికించే సిరిసంపదగా పెద్ద చెరువు నిలుస్తున్నది.
అహ్లాదకరంగా పల్లె ప్రకృతి వనం
గ్రామ శివారులో జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన పల్లె పకృతి వనాన్ని ఏర్పాటు చేశారు. ఈ పల్లె ప్రకృతి వనం ప్రజలను ఎంతో ఆకట్టుకున్నది.
వైకుంఠధామం
నాటి శ్మశానవాటిక నేడు వైకుంఠధామంగా మారింది. ముళ్లపొదలు, పిచ్చిమొక్కలు, చెట్లతో చిట్టడివిని తలపించే శ్మశానవాటికను తెలంగాణ ప్రభుత్వం వచ్చాకనే అది వైకుంఠధామంగా నామకరణం చేశారు. మనిషి అంతిమ దహన సంస్కారాలకు వేదికగా వైకుంఠధామం నిలిచిందని చెప్పుకోవచ్చు. వైకుంఠధామంలో పత్య్రేక సౌకర్యాలను ఏర్పాటు చేసి ప్రజలకు సౌకర్యాలను అందిస్తున్నారు.స్నానాలు చేసేందుకు వీలుగా నీటి సౌకర్యం కోసం బోరుబావిని తవ్వించారు. మహిళలకు ప్రత్యేకంగా స్నానాల గదులను సైతం నిర్మించారు.
నాలుగున్నరేండ్ల్లలో రూ. 40 లక్షలతో అభివృద్ధి
నాలుగున్నరేండ్లలో రూ. నలభై లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టా . జిల్లా పరిషత్ చైర్ పర్స న్ పట్లోళ్ల మంజుశ్రీజైపాల్రెడ్డి, ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ సహకారాలతో గ్రామా న్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నా. సిమెంటు రోడ్లు, మురుగు కాల్వలు తాగునీటి సౌకర్యం, వీధి స్తంభాలు, లైట్లు, పారిశుధ్యం, విద్యా, వైద్యం వంటి సౌకర్యాలు క ల్పించా. గ్రామం దినదినాభివృద్ధి చెందుతుందని, వచ్చే ఐదేండ్ల నాటికల్లా సుల్తాన్పూర్ మరింతగా అభివృద్ధి పథంలో పయనిస్తుంది.
– న్యాత మాణయ్య, సర్పంచ్