జనగామలో ఈనెల 16న జరగనున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభకు ప్రజలు ఉప్పెనలా తరలిరావాలని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జనగామ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి కోరారు. మద్దూరు, ధూళిమిట్ట మండల కేంద్రాల్లో శుక్రవారం జరిగిన బీఆర్ఎస్ సన్నాహక సమావేశాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ వంద సీట్లు గెలుపొంది మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. పదేండ్ల కింద తెలంగాణ ఎట్లుండే.. ఇప్పుడెట్లా ఉందో చూడాలన్నారు. క్షేత్ర స్థాయిలో నాయకులు,కార్యకర్తలు సమష్టిగా పనిచేసి బీఆర్ఎస్ను గెలిపించాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి టికెట్లు అమ్ముకునే సంస్కృతి ఉన్నదని, చిల్లరమల్లర విమర్శలు చేస్తున్న కొమ్మూరి ప్రతాప్రెడ్డి దమ్ముంటే సేవ చేయడంలో పోటీపడాలని సవాల్ విసిరారు.
మద్దూరు(ధూళిమిట్ట), అక్టోబర్ 13 : ఈ నెల 16న జనగామలో జరిగే సీఎం కేసీఆర్ బహిరంగ సభకు ప్రజలు ఉప్పెనలా తరలిరావాలని బీఆర్ఎస్ జనగామ అభ్యర్థి డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి కోరారు. శుక్రవారం మద్దూరు, ధూళిమిట్ట మం డల కేంద్రాల్లో బీఆర్ఎస్ మండల శాఖల అధ్యక్షుడు మేక సంతోష్కుమార్, మంద యాదగిరి అధ్యక్షతన నిర్వహించిన సన్నాహక సమావేశానికి పల్లా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో జనగామ, చేర్యాల ప్రాంతాలు సీఎం కేసీఆర్కు వెన్నుదన్నుగా నిలిచినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ వంద సీట్లలో విజయం సాధిస్తున్నదని ధీమా వ్యక్తం చేశారు. పదేండ్ల కింద తెలంగాణ ఎట్లుం డే.. ఇప్పుడెట్లా ఉందో చూడాలన్నారు. ఒకనాడు 24లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిన తెలంగాణలో ప్రస్తుతం 3కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతుందన్నారు. ప్రపంచంలోని 20 ప్రభావమైన పథకాలలో రైతుబంధు, రైతుబీమా పథకాలు నిలుస్తాయన్నారు. కాంగ్రెస్ది టికెట్లు అమ్ముకునే సంస్కృతి ఉందన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను ప్రజలు నమ్మరన్నారు. జనగామ, చేర్యాల, ధర్మసాగర్ ప్రాంతాలు ఒకనాడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉండేవని పల్లా అన్నారు. నేను ఈ ప్రాంతపు మట్టి బిడ్డనే. ఈ ప్రాంతపు కష్టాలు నాకు పూర్తిగా తెలుసు. సీఎం కేసీఆర్ ఆదేశాలు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆశీస్సులతో ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రజల ముందుకు వచ్చినట్లు తెలిపారు. తనపై చిల్లరమల్లర విమర్శలు చేస్తున్న కొమ్మూరి ప్రతాప్రెడ్డి దమ్ముంటే సిద్ధాంతపరంగా లేదా సేవ చేయడంలో పోటీపడాలన్నారు. రేవంత్రెడ్డికి డబ్బులు, భూములిచ్చి టికెట్ తెచ్చుకుంటున్నట్లు విమర్శించారు. జనగామ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా తాను పనిచేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే తన ఎమ్మెల్సీ నిధుల నుంచి మద్దూరు, ధూళిమిట్ట మండలాలకు రూ.60లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు.
జనగామ బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డిని ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, మద్దూరు మాజీ జడ్పీటీసీ జల్లి సిద్దయ్య అన్నారు. రాజేశ్వర్రెడ్డి గెలిస్తే జనగామ సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గలతో అభివృద్ధిలో పోటీపడుతుందన్నారు. జనగామ ప్రాంత ప్రజలు చైతన్యవంతులన్నారు. అంతకుముందు పల్లా రాజేశ్వర్రెడ్డికి మద్దూరు, ధూళిమిట్ట మండలాల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. పల్లా రాజేశ్వర్రెడ్డిని శాలువాలతో ఘనంగా సన్మానించారు. సమావేశంలో ఎంపీపీ బద్దిపడిగె కృష్ణారెడ్డి, వైస్ఎంపీపీ మలిపెద్ది సుమలతామల్లేశం, పీఏసీఎస్ చైర్మన్ నాగిళ్ల తిరుపతిరెడ్డి, వైస్చైర్మన్ ఇర్రి రాజిరెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు వంగ భాస్కర్రెడ్డి, చొప్పరి వరలక్ష్మీసాగర్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు ఆకుల యాదగిరి, మద్దూరు, ధూళిమిట్ట సర్పంచులు కంఠారెడ్డి జనార్దన్రెడ్డి, దుబ్బుడు దీపికావేణుగోపాల్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఖాజా ఆరీఫ్, మాజీ జడ్పీటీసీ నాచగోని పద్మావెంకట్గౌడ్, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.