ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నాయకులు మాయమాటలు చెప్పి ఓట్లు దండుకోవడానికి వస్తున్నారని, అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలని, అభివృద్ధి చేస్తున్న పార్టీకి పట్టం కట్టాలని నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం హత్నూర మండలం రొయ్యపల్లి, శేర్కాన్పల్లి, నాగారం, కొత్తగూడెం, రెయింన్లగూడ, వడ్డెపల్లి, చింతల్చెరు, రెడ్డిపాలెం తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆమె ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది.
హత్నూర, నవంబర్ 24: అభివృద్ధి చేస్తున్న బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలని నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి తెలిపారు. శుక్రవారం హత్నూర మండలం రొయ్యపల్లి, శేర్కాన్పల్లి, నాగారం, కొత్తగూడెం, రెయింన్లగూడ, వడ్డెపల్లి, చింతల్చెరు, రెడ్డిపాలెం తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నాయకులు మాయమాటలు చెప్పి ఓట్లు దండుకోవడానికి వస్తున్నారని, అలాంటి వారిపట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేయడంతోపాటు రాష్ర్టాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. నేడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి వ్యవసాయ రంగాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నట్లు గుర్తుచేశారు. నిరంతర విద్యుత్, సీసీరోడ్లు, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం తదితర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. కేవలం ఎన్నికల సమయంలోనే ప్రజలకు కనిపించే ప్రతిపక్ష నాయకులు మాయమాటలు చెబుతూ ఓట్లు దండుకోవాలని చూస్తున్నారన్నారు. అలాంటి పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండి అభివృద్ధి సాధిస్తున్న బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందన్నారు.
హత్నూరా మండలంలోని పలు గ్రామాల్లో సునీతా లక్ష్మారెడ్డి నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఆమెకు మద్దతు తెలిపారు. గ్రామాల్లోకి వెళ్లిన ఎమ్మెల్యే అభ్యర్థికి ప్రజలు, మహిళలు ఉత్సాహంగా స్వాగతం పలుకుతూ చైతన్యపరిచారు. ప్రచారంలో సునీతాలక్ష్మారెడ్డి కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ దేవేందర్రెడ్డి, ఎంపీపీ నర్సింహులు, జడ్పీటీసీ ఆంజనేయులు, మండ ల అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, నాయకులు దామోదర్రెడ్డి, దు ర్గారెడ్డి, శివశంకర్రావు, బుచ్చిరెడ్డి, సుధాకర్, దేవేందర్రావు, అర్జున్, ఆగమయ్య, వీరేందర్, శ్రీకాంత్, సుదర్శన్గౌడ్, పోచాగౌడ్, బాబుయాదవ్, రమేశ్నాయక్, నర్సింలు, శ్రీనివాస్, సతీశ్, తదితరులు పాల్గొన్నారు.
శివ్వంపేట, నవంబర్ 24: శివ్వంపేట మండల కేంద్రంలో వెలిసిన శ్రీ బగలాముఖి శక్తిపీఠంలో, మండలంలోని చండి గ్రామంలో ఉన్న చండికామాత అమ్మవార్లను శుక్రవారం బీఆర్ఎస్ అభ్యర్థి వాకిటి సునీతారెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ అమ్మవార్ల ఆశీర్వాదం, ప్రజల దీవెనతో మంచి మెజార్టీతో తాను గెలుపొందుతానని ధీమా వ్యక్తం చేశారు. అంతకుముందు వేద పండితులు సంతోష్శర్మ తీర్థప్రసాదాలు అందజేశారు. పూజల్లో జడ్పీటీసీ పబ్బమహేశ్గుప్తా, సర్పంచ్ పత్రాల శ్రీనివాస్గౌడ్, ఉపసర్పంచ్ పద్మవెంకటేశ్, వార్డు సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.
నర్సాపూర్, నవంబర్ 24: బీఆర్ఎస్ నాయకుడు సింగాయిపల్లి గోపి దెబ్బకు బీజేపీ నాయకులు బీఆర్ఎస్లోకి క్యూ కడుతున్నారు. శుక్రవారం నర్సాపూర్ మండల ఎస్సీ మోర్చా అధ్యక్షుడు జమునగళ్ల కుమార్ గోపి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.